Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో గ్రూపు-4 ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడి - 11,574 మంది అర్హత

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2022 (13:50 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూపు-4 ఫిలిమ్స్ పరీక్షా ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) తాజాగా విడుదల చేసింది. ఈ ఫలితాల్లో మొత్తం 11,574 మంది అర్హత సాధించారు. మొత్తం 2,11,341 మంది ఈ పరీక్షకు హాజరైనట్టు ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. 
 
రాష్ట్ర రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్సెంట్ పోస్టుల భర్తీ కోసం గ్రూపు-4 ప్రిలిమ్స్ ప్రవేశ పరీక్షలను నిర్వహించారు. గత జూలై 31వ తేదీన నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలను బుధవారం రాత్రి విడుదల చేసింది. 
 
ఇందులో మొత్తం 2,11,341 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా, మెయిన్ పరీక్షకు 11574 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్టు తెలిపింది. మెయిన్స్‌కు అర్హత సాధించిన వారి వివరాలను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచింది. 

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments