Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోవా - హైదరాబాద్ స్పైస్ జెట్ విమానానికి తప్పిన పెను ప్రమాదం

Webdunia
గురువారం, 13 అక్టోబరు 2022 (13:42 IST)
గోవా - హైదరాబాద్ ప్రాంతాల మధ్య నడిచే స్పైస్‌జెట్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఈ విమానం ఇంజిన్ నుంచి పొగలు వస్తున్నట్లు గుర్తించిన పైలట్ విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశాడు. దీంతో అందులోని ప్రయాణికులు తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. 
 
మీడియా వర్గాల మేరకు, గోవా నుంచి హైదరాబాద్ స్పైస్‌జెట్ విమానం 86 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఈ విమానం టేకాఫ్ కాగానే విమానంలో పొగలు రావడాన్ని పైలెట్ గుర్తించారు. దీంతో ప్రయాణికులు భయాందోళనలు నెలకొన్నాయి.
 
విమానంలోని పొగ పీల్చడం వల్లే ఓ మహిళా ప్రయాణికుడు అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రమాదాన్ని పసిగట్టిన పైలట్‌ శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్‌ చేశాడు. 

సంబంధిత వార్తలు

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

ఎందుకొచ్చిన గొడవ.. నా ట్వీట్‌ను తొలగించాను.. నాగబాబు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments