Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో ఇండస్ట్రీ అడ్వైజరీ బోర్డుని ప్రారంభించిన యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ లండన్

ఐవీఆర్
మంగళవారం, 19 నవంబరు 2024 (23:29 IST)
తమ కొనసాగుతున్న ఇండియా టూర్ 2024లో భాగంగా, యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ లండన్(యుఈఎల్) ఈరోజు హైదరాబాద్‌లో తమ ఇండస్ట్రీ అడ్వైజరీ బోర్డు(ఐఏబి)ని ప్రారంభించింది. ఈ ముఖ్యమైన మైలురాయి విశ్వవిద్యాలయం యొక్క మూడు-నగరాల పర్యటనలో రెండవ స్టాప్‌ని సూచిస్తుంది, ఇది విద్యా-పరిశ్రమ భాగస్వామ్యాలను బలోపేతం చేయడం, సస్టైనబుల్ విద్యను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఐఏబి ప్రారంభంతో పాటు జరిగిన హెచ్ఆర్ రౌండ్‌టేబుల్, డిజిటల్ పరివర్తన, ఉద్యోగుల అనుభవం, వైవిధ్యత మరియు చేరికలతో సహా మానవ వనరులలో తాజా పోకడలు, సవాళ్లను చర్చించడానికి పరిశ్రమ నాయకులు, విద్యావేత్తలు, ప్రభుత్వ అధికారులను ఒకచోట చేర్చింది.
 
ఐఏబిని ప్రారంభించడం ద్వారా, వినూత్నమైన, పరిశ్రమకు సంబంధించిన పాఠ్యాంశాలను అభివృద్ధి చేయడానికి, విద్యార్థుల ఉపాధిని మెరుగుపరచడానికి, పరిశోధన మరియు ఆవిష్కరణలను నడపడానికి పరిశ్రమ నిపుణులతో భాగస్వామ్యం చేసుకోవటం యుఈఎల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వ్యూహాత్మక చర్య యుఈఎల్ యొక్క ప్రోగ్రామ్‌లు జాబ్ మార్కెట్ యొక్క అభివృద్ధి చెందుతున్న అవసరాలకు అనుగుణంగా ఉండేలా చేస్తుంది. బోర్డ్ యొక్క ఎజెండా రెండు ముఖ్యమైన ప్రతిపాదనలను కలిగి ఉంది: (ఏ) భారతీయ విద్యార్థులలో అసాధారణమైన విద్యావిషయక విజయాన్ని గుర్తించి, ప్రోత్సహించడానికి మెరిట్-ఆధారిత స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించడం మరియు (బి) యుఈఎల్ యొక్క విలక్షణమైన కెరీర్‌ల ప్రతిపాదన యొక్క ప్రదర్శన, ఇది ప్రపంచవ్యాప్తంగా ఆలోచనాపరులైన గ్రాడ్యుయేట్‌లను పెంపొందించడానికి  4,500 కంటే ఎక్కువగా వున్న  పరిశ్రమ భాగస్వామ్యంతో కూడిన  నెట్‌వర్క్‌ పై ఆధారపడి ఉంటుంది. 
 
హెచ్‌ఆర్ రౌండ్‌టేబుల్‌లో పలువురు ప్రతినిధులు చర్చించిన అంశాలు, 'ఏళ్లుగా యుకెలో భారతీయ విద్యార్థుల భాగస్వామ్యం పెరుగుదల మరియు యుఈఎల్ లో భారతీయ విద్యార్థుల వాటా పెరగడం'; 'యుఈఎల్ మరియు విస్తృత యుకె  విద్యా మార్కెట్‌కు భారతీయ విద్యార్థుల ప్రాముఖ్యత'; 'భారత విద్యార్థుల మార్కెట్ నుండి యుఈఎల్ అంచనాలు మరియు ఈ అంచనాలను అందుకోవడానికి చేపట్టిన కార్యక్రమాలు '; మరియు 'భారత విద్యార్థులకు యుఈఎల్ అనువైన ఎంపిక కావడానికి ప్రధాన కారణాలు' వంటివి ఉన్నాయి.  ఈ కార్యక్రమంలో జరిగిన హెల్త్‌టెక్ రౌండ్‌టేబుల్, ‘ఆరోగ్య ఆవిష్కరణలు మరియు వెల్‌నెస్‌ను నడపడానికి భారతదేశంలో యుఈఎల్ యొక్క ఇయర్ ఆఫ్ హెల్త్ కార్యక్రమం ను ప్రారంభించడం’ అనే అంశంపై జరిగింది.
 
"సాంకేతిక నైపుణ్యం మరియు వ్యవస్థాపక స్ఫూర్తికి పేరుగాంచిన హైదరాబాద్, మా ఇండియా టూర్ 2024కి సరైన నేపథ్యం అందిస్తుంది " అని యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ వైస్-ఛాన్సలర్ మరియు ప్రెసిడెంట్ ప్రొఫెసర్ అమండా జె. బ్రోడెరిక్ అన్నారు. “మా ఇండస్ట్రీ అడ్వైజరీ బోర్డ్ ప్రారంభం మరియు పూర్తి పరిజ్ఞానంతో కూడిన విధంగా జరిగిన హెచ్‌ఆర్ రౌండ్‌టేబుల్ బలమైన పరిశ్రమ-అకాడెమియా భాగస్వామ్యాలను పెంపొందించాలానే  మా ప్రయత్నాలలో కీలకమైన భాగాలు. పరిశ్రమ నాయకులతో భాగస్వామ్యం చేసుకోవటం ద్వారా, గ్లోబల్ జాబ్ మార్కెట్‌లో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలు మరియు విజ్ఞానంతో మా విద్యార్థులను సన్నద్ధం చేయాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ఈ కార్యక్రమం , స్థిరమైన విద్య మరియు ఆవిష్కరణలపై మా దృష్టితో కలిపి, భారతదేశ భవిష్యత్తుపై సానుకూల ప్రభావం చూపడానికి యుఈఎల్ యొక్క నిబద్ధతను నొక్కి చెబుతుంది.." అని అన్నారు. 
 
యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ లండన్(యుఈఎల్) ఇండియా టూర్ 2024, సిమెన్స్, టి-హబ్‌ల సహకార కార్యక్రమం, ఉన్నత విద్యలో సుస్థిరతను పెంపొందించడం,భారతదేశంలోని విద్యాసంస్థలు,పరిశ్రమల మధ్య ప్రభావవంతమైన భాగస్వామ్యాలను పెంపొందించడంలో ఒక ముఖ్యమైన అడుగు. ఈ బహుళ-నగర పర్యటన విద్య, పరిశ్రమల సహకారాన్ని బలోపేతం చేయడానికి, సస్టైనబుల్  విద్యను ప్రోత్సహించడానికి, తదుపరి తరం ప్రపంచ నాయకులను ప్రేరేపించడానికి రూపొందించబడింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments