Webdunia - Bharat's app for daily news and videos

Install App

యస్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు.. రూ.50వేలకు మించి నో విత్‌డ్రా

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2020 (11:14 IST)
Yes Bank
యస్ బ్యాంకుపై ఆర్బీఐ నెల రోజుల పాటు ఆంక్షలు విధించింది. యస్ బ్యాంక్‌పై ఆర్బీఐ నెలరోజుల పాటు మారటోరియం విధించింది. ఈ 30 రోజుల పాటు బ్యాంకు నుంచి క్యాష్​ విత్​డ్రాలపైనా పరిమితి పెట్టింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ఒక వ్యక్తికి సంబంధించి అన్ని అకౌంట్లు కలిపి రూ.50 వేలకు మించి విత్​డ్రాకు అనుమతించవద్దని ఆదేశించింది. 
 
డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని, ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆర్​బీఐ చెప్పింది. బ్యాంకు చేసే ఖర్చులపైనా పరిమితి విధించింది. ఒక్కో ఐటమ్​కు సంబంధించి రూ.50 వేలకు మించి ఖర్చు చేయవద్దని ఆదేశించింది. 
 
శుక్రవారం నుంచి ఎటువంటి లోన్లు జారీ చేయవద్దని, రెన్యువల్​ చేయవద్దని స్పష్టం చేసింది. ఉద్యోగుల జీతాలు, బిల్లులు, అద్దె, ట్యాక్సుల చెల్లింపునకు మాత్రం అనుమతి ఇచ్చింది. అలాగే యస్​ బ్యాంక్​ బోర్డును తక్షణం రద్దు చేస్తున్నట్టు గురువారం స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments