Webdunia - Bharat's app for daily news and videos

Install App

యస్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు.. రూ.50వేలకు మించి నో విత్‌డ్రా

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2020 (11:14 IST)
Yes Bank
యస్ బ్యాంకుపై ఆర్బీఐ నెల రోజుల పాటు ఆంక్షలు విధించింది. యస్ బ్యాంక్‌పై ఆర్బీఐ నెలరోజుల పాటు మారటోరియం విధించింది. ఈ 30 రోజుల పాటు బ్యాంకు నుంచి క్యాష్​ విత్​డ్రాలపైనా పరిమితి పెట్టింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ఒక వ్యక్తికి సంబంధించి అన్ని అకౌంట్లు కలిపి రూ.50 వేలకు మించి విత్​డ్రాకు అనుమతించవద్దని ఆదేశించింది. 
 
డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని, ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆర్​బీఐ చెప్పింది. బ్యాంకు చేసే ఖర్చులపైనా పరిమితి విధించింది. ఒక్కో ఐటమ్​కు సంబంధించి రూ.50 వేలకు మించి ఖర్చు చేయవద్దని ఆదేశించింది. 
 
శుక్రవారం నుంచి ఎటువంటి లోన్లు జారీ చేయవద్దని, రెన్యువల్​ చేయవద్దని స్పష్టం చేసింది. ఉద్యోగుల జీతాలు, బిల్లులు, అద్దె, ట్యాక్సుల చెల్లింపునకు మాత్రం అనుమతి ఇచ్చింది. అలాగే యస్​ బ్యాంక్​ బోర్డును తక్షణం రద్దు చేస్తున్నట్టు గురువారం స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments