Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్షమాభిక్ష కోరలేదు.. ఆ సంతకం నాది కాదు.. : నిర్భయ కేసు దోషి

క్షమాభిక్ష కోరలేదు.. ఆ సంతకం నాది కాదు.. : నిర్భయ కేసు దోషి
, ఆదివారం, 8 డిశెంబరు 2019 (15:53 IST)
ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసులోని దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ క్షమాభిక్ష కోరినట్టు, దాన్ని తోసిపుచ్చాలని ఢిల్లీ సర్కారు సిఫార్సు చేసింది. ఈ మేరకు పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే, ఈ కేసులో ఇపుడు ఓ ట్విస్ట్ జరిగింది. అసలు తాను క్షమాభిక్ష కోరలేని, పైగా, అందులో ఉన్నది తన సంతకం కాదని ప్రకటించాడు. 
 
అసలు తాను పిటిషన్‌పై సంతకమే చేయలేదని.. ప్రస్తుతం ఉన్నదానిని వెంటనే ఉపసంహరించుకునే అవకాశం ఇవ్వాలని వినయ్ శర్మ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌కు లేఖ రాశాడు. కేంద్ర హోంశాఖ రాష్ట్రపతికి పంపిన క్షమాభిక్ష పిటిషన్‌లో తన సంతకం లేదనీ.. అది తాను పెట్టుకున్న అర్జీ కాదన్నాడు. దీంతో నిర్భయ దోషులకు త్వరలోనే ఉరిశిక్ష విధించే అవకాశాలు ఉన్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తాటికల్లు, లీజు ఇళ్లపై జీఎస్టీ... ప్రజల నెత్తిన పెనుభారం..