Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పులు ఇవ్వనున్న జియోమీ సంస్థ... వడ్డీరేటు రూ.2 లోపే

Webdunia
సోమవారం, 26 ఆగస్టు 2019 (14:15 IST)
భారతదేశంలో మొబైల్ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న జియోమీ సంస్థ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మొబైల్స్ మాత్రమే కాకండా టీవీలు, ఎయిర్ ప్యూరిఫైయర్స్, పవర్ బ్యాంక్‌లు, ఇయర్ ఫోన్స్ వంటి మొబైల్ యాక్సెసరీస్‌ను వినియోగదారులకు అందించిన జియోమీ  సంస్థ ఇప్పుడు ఫైనాన్సియల్ సర్వీసెస్ రంగంలో అడుగుపెట్టబోతోంది. 
 
కన్సూమర్ లెండింగ్ బిజినెస్ స్టార్ట్ చేయబోతోంది. జియోమీకి చెందిన Mi Credits యాప్ ద్వారా వినియోగదారులకు అప్పులు ఇవ్వనుంది. కాగా ఇప్పటికే జియోమీ సంస్థ Mi Pay మొబైల్ వ్యాలెట్‌ను ప్రారంభించింది. త్వరలో Mi Credits యాప్‌తో ఇండియాలో అప్పులు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.
 
Mi Credits సర్వీస్ ద్వారా జియోమీ సంస్థ యూజర్లకు ఒక్కొక్కరికి రూ.1,00,000 వరకు లోన్ ఇవ్వనుంది. వడ్డీ రేట్లు 1.8 శాతం నుంచి ప్రారంభమౌతాయి. అంటే రూ.2 రూపాయల లోపే అన్న మాట. మరికొన్ని వారాల్లో ఈ జియోమీ లోన్ సర్వీస్ భారత్‌లో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సర్వీస్ బీటా ఫేజ్‌లో ప్రారంభమైంది. 
 
బీటా ఫేజ్ విజయవంతం అయితే త్వరలోనే Mi Credit యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. భారత్‌లో ఇప్పటికే ఆన్‌లైన్ లెండింగ్ ప్లాట్‌ఫామ్స్ చాలా ఉన్నాయి. వీటన్నింటికీ పోటీగా జియోమీ వస్తోంది. స్మార్ట్‌ఫోన్ రంగంలో సంచలనాలను సృష్టించిన జియోమీ సంస్థ ఫైనాన్షియల్ సర్వీసెస్ మార్కెట్‌లో కూడా సంచలనాలను నమోదు చేస్తుందేమో చూడాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments