Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కరోనా కాటు... కానీ భారత్‌కు మాత్రం...

Webdunia
మంగళవారం, 31 మార్చి 2020 (13:58 IST)
ప్రపంచాన్ని కరోనా వైరస్ చుట్టుముట్టేసింది. ఈ వైరస్ బారి నుంచి బయటపడేందుకు ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయినప్పటికీ.. ఏ ఒక్క దేశం కృషి ఫలించడం లేదు. దీంతో ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్యతో పాటు.. మరణిస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. 
 
ఈ క్రమంలో కరోనా వైరస్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కాటేసింది. కరోనా దెబ్బకు అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయి. దీంతో ప్రపంచం ఈ ఏడాది ఆర్థిక మాంద్యంలోకి జారుకొనే అవకాశముందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. ఈ పరిస్థితుల్లో ప్రపంచ దేశాలను ఆదుకోవడానికి 2.5 ట్రిలియన్‌ డాలర్ల ప్యాకేజీ అవసరముంటుందని అభిప్రాయపడింది. 
 
ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు కరోనా షాక్‌ పేరుతో ఐరాస ట్రేడ్ రిపోర్ట్ విడుదల చేసింది. అయితే, ఆర్థిక మాంద్యంలోకి జారుకునే ప్రమాదం భారత్, చైనాలకు మాత్రం ఉండకపోవచ్చని తెలిపింది. వస్తువుల ఎగుమతులపై ఆధారపడిన అభివృద్ధి చెందుతోన్న దేశాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది.
 
కరోనా వైరస్ కారణంగా ఈ యేడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోతుందని, ఈ నేపథ్యంలోనే దేశాలు మాంద్యంలోకి జారుకునే ప్రమాదం ఉందని వివరించింది. ఐక్యరాజ్య సమితి తాజా వార్త కోట్ల మంది భారతీయులకు ఓ శుభవార్త వంటిదని చెప్పొచ్చు. 

సంబంధిత వార్తలు

మాస్ ప్రేక్షకులను మెప్పించే చిత్రం "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" : ప్రముఖ నటి అంజలి

రేవ్ పార్టీలో లేకపోవడం మీడియాకు కంటెంట్ లేదు.. రేయి పగలు జరిగే ప్రశ్న : నటుడు నవదీప్

అల్లు అర్జున్‌పై కేసు నమోదు.. ఈసీ సీరియస్

నా ఐడియాను కాపీ కొట్టి సాయి రాజేష్ ‘బేబి’ తీశాడు : దర్శకుడు శిరిన్‌ శ్రీరామ్

ఆ టైప్ కాస్ట్ ను బ్రేక్ చేసిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఎనర్జీకి హ్యాట్సాఫ్ : నటసింహం బాలకృష్ణ

ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరికి థైరాయిడ్.. వామ్మో జాగ్రత్త

హైబీపి వుందా? ఐతే ఇవి తినకూడదు

కొలెస్ట్రాల్ అధికంగా వున్నవారు తినకూడని పదార్థాలు

ఎండాకాలంలో చర్మ సంరక్షణకు ఏం చేయాలి... ఈ జాగ్రత్తలు పాటిస్తే..?

ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే

తర్వాతి కథనం
Show comments