Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖపట్నం- విజయవాడలకు కొత్త విమాన సేవలు... ఆదివారాల్లో?

సెల్వి
శనివారం, 26 అక్టోబరు 2024 (15:49 IST)
విశాఖపట్నం- విజయవాడలను కలుపుతూ రెండు అదనపు విమానాలు త్వరలో ప్రారంభమవుతాయి. ఆదివారాల్లో ఈ సేవలు వుంటాయి. ఆదివారం నుంచి ఇండిగో-ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లచే నిర్వహించబడుతున్న ఈ కొత్త సర్వీసులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించనున్నారు. 
 
ఇండిగో విమానం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాత్రి 7:15 గంటలకు బయలుదేరి రాత్రి 8:20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. విశాఖపట్నం నుంచి తిరుగు ప్రయాణంలో ఉదయం 8:45 గంటలకు బయలుదేరి 9:50 గంటలకు విజయవాడ చేరుకోవాల్సి ఉంది. 
 
కాగా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం విశాఖపట్నంలో ఉదయం 9:35 గంటలకు బయలుదేరి 10:35 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రాత్రి 7:55 గంటలకు విజయవాడ బయలుదేరి రాత్రి 9:00 గంటలకు తిరిగి విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ సర్వీసులతో విజయవాడ-విశాఖపట్నం మధ్య విమాన సర్వీసుల సంఖ్య 3కి పెరగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్యాన్వీ గుర్తింపు, ఇష్క్ బావ్లాను ఆవిష్కరించిన కోక్ స్టూడియో భారత్

పాపా చిత్ర విజయంతో స్ట్రెయిట్ సినిమా ప్లాన్ చేయబోతున్నాం: నిర్మాత నీరజ కోట

విష్ణు మంచు కన్నప్ప నుంచి అవ్రామ్ మంచు మేకింగ్ వీడియో

అనంత పద్మనాభ స్వామి టెంపుల్ సెట్‌లో విరాట్ కర్ణ చిత్రం నాగబంధం

సుహాస్ , కీర్తి సురేష్ నటించిన ఉప్పు కప్పురంబు ట్రెయిలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

Mango: పెరుగుతో మామిడి పండ్లను కలిపి తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలేనా?

వ్యాయామానికి ముందు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments