Webdunia - Bharat's app for daily news and videos

Install App

దళితులపై హింస-98 మంది వ్యక్తులకు జీవిత ఖైదు

సెల్వి
శనివారం, 26 అక్టోబరు 2024 (15:15 IST)
కర్ణాటక మరకుంబి గ్రామంలో దళితులపై హింసాత్మక దాడికి పాల్పడినందుకు కొప్పల్‌లోని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు 98 మంది వ్యక్తులకు జీవిత ఖైదు, ఒక్కొక్కరికి రూ. 5,000 జరిమానా విధించింది. 
 
భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ), ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీల నిరోధక) చట్టంలోని వివిధ సెక్షన్ల కింద దోషులపై అభియోగాలు మోపారు. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, స్పెషల్ జడ్జి సి చంద్రశేఖర్ మరో ముగ్గురికి ఐదేళ్ల జైలుశిక్ష విధించారు. 
 
గంగావతి రూరల్ పోలీసులు దాఖలు చేసిన ఈ కేసులో మొదట 117 మంది పేర్లను నమోదు చేశారు. అయితే కొంతమంది నిందితులు మరణించారు. ఛార్జ్ షీట్‌లో కొందరి పేర్లు పునరావృతమయ్యాయి. 
 
చివరకు 101 మంది నిందితులను కోర్టు దోషులుగా నిర్ధారించింది. హింసాత్మక సంఘటన ఆగష్టు 29, 2014న, గంగావతి తాలూకాలోని మరకుంబి గ్రామం జరిగింది. ఈ సందర్భంగా అగ్రవర్ణాల వ్యక్తుల గుంపు ఎస్సీ కమ్యూనిటీ సభ్యులపై దాడి చేసి, అనేక ఇళ్లకు నిప్పు పెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments