దళితులపై హింస-98 మంది వ్యక్తులకు జీవిత ఖైదు

సెల్వి
శనివారం, 26 అక్టోబరు 2024 (15:15 IST)
కర్ణాటక మరకుంబి గ్రామంలో దళితులపై హింసాత్మక దాడికి పాల్పడినందుకు కొప్పల్‌లోని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు 98 మంది వ్యక్తులకు జీవిత ఖైదు, ఒక్కొక్కరికి రూ. 5,000 జరిమానా విధించింది. 
 
భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ), ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీల నిరోధక) చట్టంలోని వివిధ సెక్షన్ల కింద దోషులపై అభియోగాలు మోపారు. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి, స్పెషల్ జడ్జి సి చంద్రశేఖర్ మరో ముగ్గురికి ఐదేళ్ల జైలుశిక్ష విధించారు. 
 
గంగావతి రూరల్ పోలీసులు దాఖలు చేసిన ఈ కేసులో మొదట 117 మంది పేర్లను నమోదు చేశారు. అయితే కొంతమంది నిందితులు మరణించారు. ఛార్జ్ షీట్‌లో కొందరి పేర్లు పునరావృతమయ్యాయి. 
 
చివరకు 101 మంది నిందితులను కోర్టు దోషులుగా నిర్ధారించింది. హింసాత్మక సంఘటన ఆగష్టు 29, 2014న, గంగావతి తాలూకాలోని మరకుంబి గ్రామం జరిగింది. ఈ సందర్భంగా అగ్రవర్ణాల వ్యక్తుల గుంపు ఎస్సీ కమ్యూనిటీ సభ్యులపై దాడి చేసి, అనేక ఇళ్లకు నిప్పు పెట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: స్పిరిట్ కోసం పోలీస్ గెటప్ లో యాక్షన్ చేస్తున్న ప్రభాస్ తాజా అప్ డేట్

Anil ravipudi: చిరంజీవి, వెంకటేష్ డాన్స్ ఎనర్జీ కనువిందు చేస్తుంది : అనిల్ రావిపూడి

Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్‌ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి

ఇండియన్, తెలుగు ఆడియన్స్ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తాం: డైరెక్టర్ యూ ఇన్-షిక్

CPI Narayana: ఐబొమ్మలో సినిమాలు చూశాను.. సమస్య పైరసీలో కాదు.. వ్యవస్థలో.. నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments