భారత్‌లో యూపీఏ సేవలకు ఎండ్ కార్డ్ పడనుందా?

సెల్వి
మంగళవారం, 24 సెప్టెంబరు 2024 (21:39 IST)
భారత్‌లో యూపీఏ సేవలకు ఎండ్ కార్డ్ పడనుందా అంటే సర్వేలు అవుననే చెప్తున్నాయి. యూపీఏ వినియోగదారులపై ఇటీవలి సర్వేలో ఈ విషయం వెల్లడి అయ్యింది. లోకల్‌ సర్కిల్స్ నిర్వహించిన తాజా సర్వేలో భారతదేశంలో యూపీఏ చెల్లింపుల భవిష్యత్తుకు సంబంధించి చాలా ఆసక్తికరమైన ఫలితాలను వెల్లడి అయ్యాయి. 
 
యూపీఏ లావాదేవీలపై రుసుము విధిస్తే దేశంలో ఈ సేవలను భారతీయులు కొనసాగించడం కష్టమేనని తెలిసింది. యూపీఏ లావాదేవీలపై రుసుము విధిస్తే కనుక ఆ సేవలకు బైబై చెప్పేస్తామని అత్యధికంగా 75 శాతం మంది వినియోగదారులు ఓటేశారు. 
 
రుసుము విధిస్తే.. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యాప్‌లను ఉపయోగించడాన్ని ఆపివేస్తామని స్పష్టం చేశారు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, 22% మంది వినియోగదారులు తమపై విధించే కొన్ని రకాల లావాదేవీల రుసుములకు అనుకూలంగా ఓటు వేశారు. 
 
308 జిల్లాల్లో ఈ సర్వే జరిగింది. ప్రస్తుతానికి, భారతదేశంలో మొత్తం UPI లావాదేవీలు 100 బిలియన్ల మార్కును అధిగమించాయి. ఈ సర్వే వివరణాత్మక ఫలితాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), ఆర్థిక మంత్రిత్వ శాఖకు అందించబడతాయి. 
 
ఇది ప్రజల మానసిక స్థితిని అంచనా వేయడంలో ప్రభుత్వానికి సహాయపడుతుంది. భవిష్యత్తులో యూపీఐకి ఎలాంటి లావాదేవీల రుసుములను జోడించకూడదనే ప్రజాభిప్రాయం వైపు ప్రభుత్వాన్ని నడిపిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: గోండ్ తెగల బ్యాక్ డ్రాప్ లో రష్మిక మందన్న.. మైసా

Dil Raju: రామానాయుడు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని స్ఫూర్తిగా తీసుకున్నా : దిల్ రాజు

Sharva : మోటార్ సైకిల్ రేసర్ గా శర్వా.. బైకర్ చిత్రం ఫస్ట్ లుక్

Chiranjeevi: సైకిళ్లపై స్కూల్ పిల్లలుతో సవారీ చేస్తూ మన శంకరవర ప్రసాద్ గారు

భవిష్యత్‌లో సన్యాసం స్వీకరిస్తా : పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments