Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే ప్రయాణికులకు తీపికబురు-అందుబాటులోకి ప్రైవేట్ ట్రైన్స్

Webdunia
శుక్రవారం, 29 జనవరి 2021 (19:45 IST)
రైల్వే ప్రయాణికులకు తీపికబురు అందింది. కొత్త రైళ్లు అవి కూడా ప్రైవేట్ ట్రైన్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ విషయం ఆర్థిక సర్వేలో వెల్లడైంది. ఈ ఏడాదిలోనే బిడ్స్ ప్రక్రియ పూర్తి కానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను ఆవిష్కరించారు. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రతిబింబించే ఈ ఎకనమిక్ సర్వేలో పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి. ఆర్థిక సర్వే ప్రైవేట్ ట్రైన్స్ అంశాన్ని కూడా ప్రస్థావించింది. 
 
ప్రైవేట్ ట్రైన్స్ కోసం బిడ్స్ ఆహ్వానం 2021 మే చివరకు పూర్తవుతుందని తెలిపింది. ప్రైవేట్ ట్రైన్స్ 2023-24 కల్లా అందుబాటులోకి రావొచ్చని ఆర్థిక శాఖ పేర్కొంది. అలాగే ఎయిర్ ట్రావెల్ 2021 ఆర్థిక సంవత్సరం తొలి నాళ్లలలోనే ప్రీ-కోవిడ్ స్థాయికి చేరొచ్చని తెలిపింది. ఫార్మా రంగానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, అలాగే ఆర్‌అండ్‌డీ కోసం అధిక కేటాయింపులు జరపాల్సి ఉందని సూచించింది.
 
డిజిటల్ హెల్త్ మిషన్‌ పూర్తి చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే టెలీమెడిసిన్‌పై ఇన్వెస్ట్ చేయాల్సి ఉందని సూచించింది. అలాగే 2021-22 ఆర్థిక సంవత్సరంలో (2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి వరకు) జీడీపీ 11శాతం మేర పెరగొచ్చని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7.7 శాతం మేర తగ్గొచ్చని, కానీ తర్వాత వీ షేప్ రికవరీ ఉంటుందని పేర్కొంది.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments