Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారు వ్యాపారి నుంచి లెక్క తేలని రూ.వెయ్యి కోట్లు స్వాధీనం

Webdunia
ఆదివారం, 7 మార్చి 2021 (16:17 IST)
తమిళనాడు రాష్ట్రంలోని ఓ ప్రముఖ బంగారం వ్యాపారి నుంచి లెక్కల్లో చూపని రూ.1000 కోట్లను కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మార్చి 4న చెన్నై, ముంబై, కోయంబత్తూరు, మదురై, తిరుచురాపల్లి, త్రిసూర్, నెల్లూర్, జైపూర్, ఇండోర్‌లోని 27 చోట్ల దాడులు చేసినట్టు సీబీడీటి ప్రకటించింది. 
 
సోదాలకు సంబంధించిన వివరాలను ఆదివారం వెల్లడించింది. అయితే, ఆ వ్యాపారి ఎవరు అన్న వివరాలను మాత్రం బహిర్గతం చేసింది. దాడుల సందర్భంగా లెక్క తేలని డబ్బు లావాదేవీలు, ఆ సంస్థ నుంచి బోగస్ రుణ చెల్లింపులు, అడ్వాన్స్ కొనుగోళ్ల రూపంలో రుణ చెల్లింపుల డమ్మీ ఖాతాలు, నోట్ల రద్దు సందర్భంగా ఖాతాల్లో డిపాజిట్ చేసిన లెక్క తేలని డబ్బు, వివరాల్లేని స్టాక్‌లను గుర్తించినట్టు పేర్కొంది. 
 
స్థానికంగా ఉన్న వారి దగ్గరి నుంచి అప్పులు తీసుకుని బిల్డర్లకు రుణాలిచ్చారని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టారని చెప్పింది. ఇక, బంగారం అక్రమ కొనుగోళ్లు చేశారని వెల్లడించింది. తనకు అప్పులున్నట్టు తప్పుడు ప్రకటనలు ఇచ్చారని, పాత బంగారాన్ని నగల తయారీకి వాడుకున్నట్టు చెప్పాడని పేర్కొంది. మొత్తంగా ఆ వ్యాపారి నుంచి రూ.1000 కోట్ల దాకా స్వాధీనం చేసుకున్నామని చెప్పింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments