Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.2 వేల నోటు ముద్రణ నిలిపివేసిన ఆర్బీఐ

Webdunia
గురువారం, 10 నవంబరు 2022 (14:29 IST)
దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత తీసుకొచ్చిన మరో పెద్ద నోటు రూ.2 వేల నోటు. ఈ నోటును ఇపుడు ముద్రించండం లేదని భారత రిజర్వు బ్యాంకు తెలిపింది. ముఖ్యంగా గడిచిన రెండేళ్లలో ఈ నోటు ముద్రణను ఆర్బీఐ నిలిపివేసింది. సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు ఆర్బీఐ పై విధంగా సమాధానమిచ్చింది. 
 
గత 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటివరకు కొత్తగా 2వ వేల నోట్లు ప్రింట్ చేయడం లేదు. కొంతకాలంగా రూ.2 వేల నోటు చాలమణిలో కనిపించడం లేదు. ఏటీఎంలలో కూడా రూ.500, రూ.200, రూ.100 నోట్లు మాత్రమే వస్తున్నాయి. మార్కెట్‌లో రూ.2 వేల నోటు కనిపించడమే అరుదైపోయిందని పలువురు దకాణాదారులు చెబుతున్నారు.
 
మరోవైపు, రూ.2 వేల నోటు ముద్రించక పోవడానికి కేంద్రం గతంలో లోక్‌సభలో వివరణ కూడా ఇచ్చింది. పెద్ద నోట్ల ముద్రణ ఆపేయడం ద్వారా నల్లధనాన్ని అరికట్టవచ్చని, నకిలీ నోట్ల బెడద నుంచి తప్పించుకోవచ్చని తెలిపింది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments