Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవై కారు బాంబు పేలుడు.. తమిళనాడులో ఎన్.ఐ.ఏ సోదాలు

Webdunia
గురువారం, 10 నవంబరు 2022 (13:25 IST)
తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో ఇటీవల జరిగిన కారు బాంబు పేలుడు కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ ముమ్మరం చేసింది. ఇందులోభాగంగా, గురువారం ఎన్.ఐ.ఏ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మొత్తం 40 ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. 
 
గత నెల 23వ తేదీన కోయంబత్తూరు నగరంలో కారు బాంబు పేలుడు సంభవించింది. మారుతి 800 కారులో ఎల్పీజీ సిలిండర్‌ పేలుడు సంభవించింది. కొట్టాయ్ ఈశ్వర్ ఆలయం ముందు భాగంలో ఈ పేలుడు జరిగి జమేజా ముబిన్ అనే వ్యక్తి మరణించాడు. 
దీనిపై ఎన్.ఐ.ఏ కౌంటర్ టెర్రరిస్ట్ టాస్క్ ఫోర్సో విభాగం దర్యాప్తు చేస్తోంది. 
 
ఈ కేసు దర్యాప్తులో భాగంగా, తమిళనాడు పోలీసులు త్వరితగతిన స్పందించి ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరిని చెన్నై పుళల్ సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో చెన్నైలోని పుదుపేట, మన్నాడు, జమాలియా, పెరంబూరు, కోయంబత్తూరులోని కొట్టైమేడు, ఉక్కడంతో సహా మొత్తం 40 ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments