Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారు నగల తయారీలో నాణ్యత పాటించలేదనీ...

Webdunia
సోమవారం, 26 జులై 2021 (16:37 IST)
హైదరాబాద్ నగరంలో ఇద్దరు స్వర్ణకారులపై మరికొందరు వ్యక్తులు విచక్షణ రహితంగాదాడి చేశారు. బంగారు నగల తయారీలో నాణ్యత పాటించకపోవడంతో ఆగ్రహించిన కొందరు వ్యాపారులు వారిపై దాడి చేశారు. హైదరాబాద్లోని చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. 

ఈ వివరాలను పరిశీలిస్తే, చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెలపురా ప్రాంతంలో కొందరు బెంగాలీలు ఆర్డర్లపై బంగారు ఆభరణాలు తయారు చేస్తుంటారు. వీరికి ఇద్దరు తయారీదారులకు కొందరు వచ్చి బంగారు ఆభరణాలు చేయాలంటూ సూచించారు. 

నగల తయారీలో నాణ్యత పాటించకుండా నమ్మక ద్రోహం చేశారని స్వర్ణకారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన వ్యాపారులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారు. ఇద్దరు స్వర్ణకారులను సిలిండర్‌కు కట్టేశారు. అనంతరం విచక్షణ మరచి రెచ్చిపోయారు. 

కర్రలు, రాడ్లతో దాడి చేశారు. బాధితులు వదిలేయమని ప్రాధేయపడినా సరే నిందితులు వినలేదు. ఒకరి తరువాత ఒకరు ముకుమ్మడిగా దాడిచేశారు. ఒంటిపై వాతలు వచ్చేలా కర్కశంగా చావబాదారు. చుట్టు ఉన్నవారు కనీసం వారిని అడ్డుకునేందుకు ప్రయత్నం కూడా చేయలేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిని చూసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments