Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నాగర్‌కర్నూల్‌లో స్వల్ప భూకంపం

Advertiesment
Nagar Kurnool
, సోమవారం, 26 జులై 2021 (09:45 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నాగర్‌కర్నూల్ జిల్లాలో సోమవారం ఉదయం స్వల్ప భూకంపం సంభవించింది. జిల్లాలోని అచ్చంపేట, లింగాల పరిసర గ్రామాలు, అమ్రాబాద్‌, ఉప్పునూత మండలాల్లో సోమవారం ఉదయం 5 గంటలకు రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. 
 
దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 4.0గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (ఎన్‌సీఎస్‌) వెల్లడించింది. హైదరాబాద్‌కు దక్షిణంగా 150 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని తెలిపింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు వచ్చాయని పేర్కొన్నది. భూ ప్రకంపనలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సింగరికోనకు బైక్‌పై వెళుతున్న దంపతులపై చిరుత అటాక్