Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఠారెత్తిస్తున్న టమోటా ధర.. కేజీ రూ.80

దేశవ్యాప్తంగా టమోటా ధరలు ఠారెత్తిస్తున్నాయి. బహిరంగ మార్కెట్‌లో టమోటా కేజీ రూ.80గా పలుకుతోది. ఈ పరిస్థితి దేశ రాజధాని ఢిల్లీతో పాటు.. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అలాగే, రైతు బజార్లలో

Webdunia
శనివారం, 25 నవంబరు 2017 (12:59 IST)
దేశవ్యాప్తంగా టమోటా ధరలు ఠారెత్తిస్తున్నాయి. బహిరంగ మార్కెట్‌లో టమోటా కేజీ రూ.80గా పలుకుతోది. ఈ పరిస్థితి దేశ రాజధాని ఢిల్లీతో పాటు.. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అలాగే, రైతు బజార్లలో రూ.30 వరకు ఉంది. అయితే రైతు బజార్లకు వచ్చే టమోటాలో నాణ్యత ఉండటం లేదని వినియోగదారులు పేర్కొంటున్నారు. 
 
టమోటా ధర పెరుగుదలకు వ్యాపారులు రెండు కారణాలు చెబుతున్నారు. ఇటీవల వివిధ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలతో టమోటా పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. అదేసమయంలో పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో టమోటాకు విపరీతమైన డిమాండ్‌ వచ్చింది.
 
దీంతో ధర అమాంతం పెరిగింది. గుజరాత్‌, మహరాష్ట్ర, రాజస్థాన్‌, కర్ణాటకల్లో సాగు చేసిన టమోటాకు బాగా నష్టం వాటిల్లింది. దీంతో ఆ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు మదనపల్లెలో సాగు చేసిన టమోటాను కొనుగోలు చేస్తున్నారు. దీంతో టమోటాకు డిమాండ్‌ పెరిగి, మదనపల్లెలోనే క్వింటాలు రూ.4 వేలు పలుకుతోంది. అక్కడ మిగిలిన టమోటాను విజయవాడకు తరలిస్తున్నారు.
 
పెరిగిన, రవాణా ఖర్చులు కలిపితే ధర 30 శాతం వరకు పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. రైతుబజారుల్లో టమోటా కిలో రూ.30 నుంచి 33 వరకు అమ్ముతున్నా, నాణ్యమైనవి దొరకడం లేదు. బహిరంగ మార్కెట్లో ధర రూ.60 వరకు పలుకుతోంది. ఈ పరిస్థితి మరో 3 నెలల వరకు గాడినపడే పరిస్థితి లేదని వ్యాపారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో కిలో రూ.70 నుంచి 80కి చేరే అవకాశం లేకపోలేదని వ్యాపారులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments