Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జియోకు ధీటుగా ఎయిర్‌టెల్ బడ్జెట్ ఫోన్లు.. రూ.1799

రిలయన్స్ జియోకు ధీటుగా టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ రెండు ధరల్లో బడ్జెట్‌ ఫోన్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ‘ఏ1 ఇండియన్‌’, ‘ఏ 41 పవర్‌’ పేర్ల‌తో వీటిని ప్రవేశపెట్టింది.

జియోకు ధీటుగా ఎయిర్‌టెల్ బడ్జెట్ ఫోన్లు.. రూ.1799
, సోమవారం, 20 నవంబరు 2017 (10:21 IST)
రిలయన్స్ జియోకు ధీటుగా టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ రెండు ధరల్లో బడ్జెట్‌ ఫోన్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ‘ఏ1 ఇండియన్‌’, ‘ఏ 41 పవర్‌’ పేర్ల‌తో వీటిని ప్రవేశపెట్టింది. 
 
భారతీ ఎయిర్‌టెల్‌, కార్బన్‌ మొబైల్స్‌ సంయుక్తంగా రెండు 4జీ స్మార్ట్ ఫోన్లను విడుద‌ల చేశాయి. ‘ఏ1 ఇండియన్‌’, ‘ఏ 41 పవర్‌’ ఫోన్‌లను వ‌రుస‌గా రూ.1,799కి, రూ.1,849కే అందిస్తున్న‌ట్లు ప్రకటించింది. వాస్తవానికి ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల అసలు ధ‌ర రూ.4,390, రూ.4,290గా ఉన్నాయి. 
 
కానీ, రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు వీలుగా 1500 రూపాయ‌ల‌కే అందించిన విష‌యం తెలిసిందే. జియో నుంచి వ‌స్తున్న పోటీని ఎదుర్కోవ‌డానికి ఎయిర్‌టెల్ ఈ స్మార్ట్‌ఫోన్‌లు అందిస్తోంది. 
 
దీనిపై భారతీ ఎయిర్‌టెల్‌ సీఎంవో రాజ్‌ పూడిపెద్ది ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ... తాము కార్బన్‌తో కలిసి పనిచేయడం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశారు. త‌మ స్మార్ట్‌ఫోన్‌ల‌ను అమెజాన్‌లో కూడా అందిస్తామ‌ని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యూఎస్‌లో చెన్నై మహిళకు అరుదైన గౌరవం