Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైడెన్‌ జోరు.. 50,000 మార్కును దాటి రికార్డు

Webdunia
గురువారం, 21 జనవరి 2021 (10:59 IST)
స్టాక్ మార్కెట్‌కు గురువారం కలిసొచ్చింది. కరోనా వైరస్‌తో ఆర్థిక వ్యవస్థ కుదేలు.. డిమాండ్‌ పతనం.. ఇవన్నీ బీఎస్‌ఈలో బుల్‌ దూకుడును అడ్డుకోలేకపోయాయి. ఎట్టకేలకు నేడు తొలి సారి 50,000 మార్కును దాటి రికార్డు సృష్టించింది. 
 
గురువారం ఉదయం దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.29 సమయంలో సెన్సెక్స్‌ 306 పాయింట్ల లాభంతో 50,098 వద్ద నిఫ్టీ 92 పాయింట్ల లాభంతో 14,736 వద్ద ట్రేడవుతున్నాయి. ప్రధాన రంగాల సూచీల్లోని అన్ని రంగాల్లో ఉత్సాహం కనిపిస్తోంది.
 
గేట్‌వే డిస్ట్రిపార్క్స్‌, ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌, జేకే టయర్స్‌, సూర్య రోష్ని లిమిటెడ్‌, హవేల్స్‌ ఇండియా షేర్లు భారీ లాభాల్లో ఉండగా.. వీఎస్‌టీ ఇండస్ట్రీస్‌, ఎల్‌అండ్‌టీ టెక్నాలజీస్‌,జీఎంఎం , ఆగ్రోటెక్‌ ఫూడ్స్‌, టాటా ఎలిక్సిలు భారీ నష్టాల్లో ఉన్నాయి.
 
బైడెన్‌ జోరు..
బుధవారం అమెరికాలో బైడెన్‌ సర్కారు ప్రమాణ స్వీకారం చేయడం మార్కెట్లో జోరును నింపింది. ముఖ్యంగా ట్రంప్‌ విధించిన ఆర్థిక ఆంక్షలు తొలగే అవకాశాలు ఉండటమే దీనికి ప్రధాన కారణం. మరో భారీ ఆర్థిక ప్యాకేజీ అమెరికాలో వెలువడే అవకాశం ఉడటం కూడా సూచీల్లో ఉత్తేజం నింపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments