Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఏంటది?

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (11:48 IST)
భారత రైల్వే శాఖ మరోసారి రైల్వే ప్రేమికులందరికీ అదిరిపోయే శుభవార్త అందించింది. దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ రైల్వే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా పెరిగే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. ఉద్యోగం వ్యాపారం నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లిన ఎంతోమంది తమ స్వగ్రామాలకు పండగకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగి పోతూ ఉంటుంది. 
 
ప్రస్తుతం అందుబాటులో ఉన్న రైళ్లు.. పెరిగే ప్రయాణికుల రద్దీకి సరిపడే అవకాశం తక్కువగానే ఉంది అందుకే దీనిపై కీలక నిర్ణయం తీసుకున్న భారత రైల్వే శాఖ రైల్వే ప్రయాణికులందరికీ శుభవార్త చెప్పింది. దసరా దీపావళి పండుగలు వస్తున్న నేపథ్యంలో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు భారత రైల్వే శాఖ తెలిపింది. 
 
కొత్తగా దేశవ్యాప్తంగా ఏకంగా 200 ప్రత్యేక రైళ్లను ప్రయాణికులు అందరికీ అధికారులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేకంగా 17 రైళ్లను పట్టాలెక్కించి నడుపుతున్నట్లు తెలుస్తోంది. 
 
సికింద్రాబాద్ నుంచి తిరుపతి, కాకినాడ నర్సాపూర్ విశాఖ చెన్నై బెంగళూరు తిరువనంతపురంకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తెలుస్తోంది. రైల్వే ప్రయాణికుల అందరికీ ఇది ఊరట కలిగించే వార్త అని చెప్పాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభద్రతా భావంలో సల్మాన్ ఖాన్ ... భద్రత రెట్టింపు - బుల్లెట్‌ఫ్రూఫ్ వాహనం దిగుమతి!!

జానీ మాస్టర్ మంచివారు.. నిరపరాధి అని తేలితే ఏంటి పరిస్థితి? అని మాస్టర్

తెలుగు సినిమాల్లో పెరిగిపోయిన తమిళ కంపోజర్ల హవా?

జానీపై కేసు పెట్టడం నేను షాక్ లో ఉన్నాను.. కొరియోగ్రాఫర్ అని మాస్టర్

ఈడీ విచారణకు హాజరైన నటి తమన్నా - అసలు కేసు కథేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments