Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఏంటది?

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (11:48 IST)
భారత రైల్వే శాఖ మరోసారి రైల్వే ప్రేమికులందరికీ అదిరిపోయే శుభవార్త అందించింది. దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ రైల్వే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా పెరిగే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. ఉద్యోగం వ్యాపారం నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్లిన ఎంతోమంది తమ స్వగ్రామాలకు పండగకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగి పోతూ ఉంటుంది. 
 
ప్రస్తుతం అందుబాటులో ఉన్న రైళ్లు.. పెరిగే ప్రయాణికుల రద్దీకి సరిపడే అవకాశం తక్కువగానే ఉంది అందుకే దీనిపై కీలక నిర్ణయం తీసుకున్న భారత రైల్వే శాఖ రైల్వే ప్రయాణికులందరికీ శుభవార్త చెప్పింది. దసరా దీపావళి పండుగలు వస్తున్న నేపథ్యంలో ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు భారత రైల్వే శాఖ తెలిపింది. 
 
కొత్తగా దేశవ్యాప్తంగా ఏకంగా 200 ప్రత్యేక రైళ్లను ప్రయాణికులు అందరికీ అధికారులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేకంగా 17 రైళ్లను పట్టాలెక్కించి నడుపుతున్నట్లు తెలుస్తోంది. 
 
సికింద్రాబాద్ నుంచి తిరుపతి, కాకినాడ నర్సాపూర్ విశాఖ చెన్నై బెంగళూరు తిరువనంతపురంకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు తెలుస్తోంది. రైల్వే ప్రయాణికుల అందరికీ ఇది ఊరట కలిగించే వార్త అని చెప్పాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments