Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనవరి ఒకటి నుంచి పలు రైళ్ళ ప్రయాణ వేళల్లో మార్పులు...

సెల్వి
మంగళవారం, 31 డిశెంబరు 2024 (19:27 IST)
దేశ వ్యాప్తంగా పలు రైళ్ళ ప్రయాణ వేళల్లో మార్పులు చేశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడిచే పలు రైలు సర్వీసు ప్రయాణ వేళల్లో కూడా ఈ మార్పులు జరిగాయి. ఈ మేరకు దక్షిమ మధ్య రైల్వే మంగళవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. 
 
విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ విజయవాడ స్టేషన్‌లో ఇక నుంచి 15 నిమిషాలు ముందుగానే బయలుదేరుతుంది. పాత షెడ్యూల్‌ ప్రకారం విజయవాడ స్టేషన్‌లో ఉదయం 6.15 గంటలకు బయలుదేరాల్సిన రైలు.. మార్చిన షెడ్యూల్‌ ప్రకారం ఉదయం 6 గంటలకే బయలుదేరుతుంది. 
 
జనవరి 1 నుంచి ఎంఎంటీఎస్‌ రైళ్ల ప్రయాణ వేళల్లోనూ దక్షిణ మధ్య రైల్వే మార్పులు చేసింది. నగర వ్యాప్తంగా 88 ఎంఎంటీఎస్‌ సర్వీసులు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం, కొత్తగా ప్రవేశపెట్టిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లను అనుసంధానం చేసేందుకు వీలుగా ఈ మార్పులు చేసినట్లు ద.మ.రైల్వే తెలిపింది. నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ (ఎన్టీఈఎస్)లో మారిన ప్రయాణ వేళలు చూసుకోవచ్చని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీర్ఘాయుష్మాన్ భవన్.. తమ్ముడికి అన్నయ్య బర్త్ డే విషెస్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments