Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీర్పు ఇచ్చేవరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దు : హైకోర్టు

ఠాగూర్
మంగళవారం, 31 డిశెంబరు 2024 (16:52 IST)
ఈ-ఫార్ములా రేస్ వ్యవహారంలోని కేసుపై తీర్పు వెలువరించే వరకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఫార్ములా ఈ-రేస్ కేసుకు నిధుల మళ్లింపు వ్యవహారంలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని పేర్కొంటూ ఆ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ అధికారులు కేటీఆర్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణ ముగిసింది. అయితే, ఈ కేసులో తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులను మరోమారు పొడగించింది. 
 
కేటీఆర్‌ క్వాష్‌ పిటిషన్‌పై గత విచారణ సందర్భంగా ఈనెల 30 వరకు అరెస్టు చేయొద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. కేటీఆర్‌పై ఏసీబీ నమోదు చేసిన కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. 10 రోజుల్లో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ధర్మాసనం ఈనెల 27కి వాయిదా వేసింది. ఆ తర్వాత విచారణ 31కి వాయిదా పడింది. తాజాగా ఇరు వైపులా వాదనలు ముగియగా.. కేటీఆర్‌ పిటిషన్‌పై తీర్పును రిజర్వు చేసింది. తీర్పు ఇచ్చే వరకు అరెస్టు చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు పొడిగించింది.
 
కాగా, ఏసీబీ తరపు అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎ.సుదర్శన్‌ రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో ఒప్పందం జరగకముందే చెల్లింపులు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రూ.46 కోట్ల బ్రిటన్‌ పౌండ్లు రూపంలో చెల్లించినట్లు చెప్పారు. ఈ-కార్ల రేసింగ్‌ సీజన్‌-10 ఒప్పందానికి ముందే నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు చేశారన్నారు. అయితే, దర్యాప్తు ఏ దశలో ఉందని ఈ సందర్భంగా ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. 
 
కేసు విచారణ ప్రాథమిక దశలోనే ఉందని.. అన్ని ఆధారాలు బయటపడతాయని ఏజీ తెలిపారు. ఇప్పటికే ఫిర్యాదుదారు దానకిశోర్‌ వాంగ్మూలం సేకరించినట్లు కోర్టుకు తెలిపారు. నిందితులు అరవింద్‌ కుమార్‌, బీఎల్‌ఎన్‌ రెడ్డి ఏమైనా పిటిషన్లు దాఖలు చేశారా అని న్యాయస్థానం అడిగింది. ఇప్పటివరకు నిందితులు ఎలాంటి పిటిషన్లు దాఖలు చేయలేదని, ఈ కేసులో ఎవరిని అరెస్టు చేయలేదని ఏజీ తెలిపారు. గవర్నర్‌ అనుమతి తర్వాతే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని ధర్మాసనానికి ఏజీ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments