Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నా వర్శిటీలో విద్యార్థినిపై అత్యాచారం... మదురై నుంచి చెన్నైకు బీజేపీ ర్యాలీ

ఠాగూర్
మంగళవారం, 31 డిశెంబరు 2024 (16:06 IST)
చెన్నై నగర నడిబొడ్డున ఉన్న అన్నా విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముఖ్యంగా, విపక్ష పార్టీలైన అన్నాడీఎంకే, బీజేపీ, పీఎంకే వంటి పార్టీలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ ఉద్యమాన్ని చేపట్టింది. ఇందులోభాగంగా, బాధితురాలికి న్యాయం చేయాలంటూ బీజేపీ మహిళా విభాగం డిమాండ్ చేస్తుంది. ఇందుకోసం ఆ పార్టీ భారీ ర్యాలీకి పిలుపునిచ్చింది. మదురై నుంచి చెన్నై వరకు దాదాపు 450కి.మీల మేర ర్యాలీ చేపట్టనున్నట్లు భాజపా తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై వెల్లడించారు. ఈ కేసులో నిందితులు డీఎంకేకు చెందినవారని, అందుకే ఈ విషయాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
 
మహిళలపై అకృత్యాలను నిరసిస్తూ భాజపా మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు ఉమరాతి రాజన్ ఆధ్వర్యంలో ఈ న్యాయ ర్యాలీ జనవరి 3న ప్రారంభం కానుంది. ఈ ర్యాలీ చెన్నైకి చేరుకున్న అనంతరం మహిళా విభాగం తమ డిమాండ్లపై గవర్నర్‌కు వినతిపత్రం అందజేయనుందని అన్నామలై తెలిపారు. అన్నావర్సిటీలోని క్యాంపస్‌లో ఇటీవల 19 ఏళ్ల విద్యార్థిపై లైంగిక దాడి ఘటన రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఈ దారుణంపై విపక్షాలతో పాటు పౌర సమాజం నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితుడు అధికార డీఎంకేకు చెందిన వ్యక్తి అంటూ పలువురు చేస్తున్న ఆరోపణల్ని ఆ పార్టీ ఖండించింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం