Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనీ చేతికి ‘జీ’ రైట్స్...

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (17:36 IST)
సుభాష్‌ చంద్ర నేతృత్వంలోని జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజస్‌ లిమిటెడ్‌ను కొనుగోలు చేసేందుకు జపాన్‌కు చెందిన సోనీ సంస్థ ముందుకొచ్చింది. దీనికి సంబంధించిన చర్చలు ఇప్పటికే చివరి దశకి చేరుకున్నట్లు సమాచారం. మొత్తం 20 నుంచి 25 శాతం వాటాలను విక్రయించాలని సుభాష్‌ చంద్ర భావిస్తున్నట్లు తెలిసింది. కాగా, ఈ విక్రయం ద్వారా రానున్న రూ.13 వేల కోట్ల మొత్తాన్ని రుణాలు చెల్లించేందుకు వినియోగించే అవకాశం ఉంది. 
 
ప్రస్తుతం ఈ చర్చలు లెక్కగట్టే దశలో ఉన్నాయి. సుభాష్‌ చంద్ర ఈ షేర్లపై దాదాపు 30 శాతం ప్రీమియం కోరుతున్నట్లు సమాచారం. సుభాష్‌ చంద్ర ఎంత వాటా ఉంచుకోవాలనే దానిపై ప్రస్తుతం చిక్కుముడి కొనసాగుతోంది. ప్రస్తుతం జీలోని 41.62 శాతం వాటాను ఎస్సెల్‌ గ్రూప్‌ కలిగి ఉంది. వాటిలో సగంపైగా ప్రస్తుతం రుణదాతల వద్ద తనఖాల్లో ఉన్నాయి. 
 
ప్రస్తుతం సుభాష్‌ దాదాపు 20శాతం వాటా తన వద్ద ఉంచుకోవాలనుకుంటూండగా... ప్రస్తుతం ఆయన రూ.650 రేటు వద్ద తన 19వ శాతం వాటాని విక్రయించినప్పటికీ... రూ.13వేల కోట్ల వరకు పొందే అవకాశం ఉంది. ఈ సొమ్ముతో పరిస్థితిని తిరిగి తన అధీనంలోకి తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం జీ సంస్థకు 171 దేశాల్లో దాదాపు 66 టెలివిజన్‌ ఛానల్స్‌ ఉండగా... భారతీయ సబ్సిడరీ కంపెనీ 29 ఛానెల్స్‌ను నిర్వహిస్తున్న సోనీ వ్యాపారానికి ఇది బాగా కలిసిరానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

Ratnavel: పెద్ది కోసం హ్యుజ్ యాక్షన్ నైట్ సీక్వెన్స్ చేస్తున్న రామ్ చరణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments