Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగు రోజుల్లో పెరుగుడుకు విరుగుడు : పెట్రో మంటపై అమిత్ షా కామెంట్స్

దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు ఎన్నడూ లేనంతగా పెరిగిపోయాయి. ముఖ్యంగా, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలను బూచీగా చూపి దేశంలోని చమురు కంపెనీలు ఇబ్బడిముబ్బడిగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేస్తున్నాయి. దీంతో గతంల

Webdunia
బుధవారం, 23 మే 2018 (11:54 IST)
దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు ఎన్నడూ లేనంతగా పెరిగిపోయాయి. ముఖ్యంగా, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలను బూచీగా చూపి దేశంలోని చమురు కంపెనీలు ఇబ్బడిముబ్బడిగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేస్తున్నాయి. దీంతో గతంలో ఎన్నడూ లేనంతగా మంగళవారం ఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ.76.87కు చేరుకోగా, ముంబైలో రూ.84.70కి చేరింది.
 
పెట్రో ధరల పరుగుపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుండడంతో బీజేపీ చీఫ్ అమిత్ షా స్పందించారు. మరో నాలుగు రోజుల్లో ఈ సమస్య నుంచి ప్రధాని మోడీ గట్టెక్కిస్తారన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, త్వరలోనే ధరలను నేలకు దించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. 
 
ధరల తగ్గింపు కోసం ఉన్నతస్థాయిలో కసరత్తు జరుగుతోందని, మరో మూడునాలుగు రోజుల్లో ఆ శుభవార్త వింటారని అమిత్ షా పేర్కొన్నారు. ఓ చక్కని పరిష్కారంతో మోడీ ప్రజల ముందుకు వస్తారని తెలిపారు. మరోవైపు కేంద్ర ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చమురు సంస్థల అధికారులతో భేటీకి సిద్ధమయ్యారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments