Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుదిరిన పదవుల డీల్.. నేడు కుమార పట్టాభిషేకం.. చంద్రబాబు హాజరు

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ - జేడీఎస్ పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. ముఖ్యంగా, ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఇరు పార్టీల మధ్య మంత్రిపదవుల పంపిణీపై డీల్ కుదిరింది. ఈ డీల్ ప్రకారం మొత్

Webdunia
బుధవారం, 23 మే 2018 (11:43 IST)
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ - జేడీఎస్ పార్టీల మధ్య ఒప్పందం కుదిరింది. ముఖ్యంగా, ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఇరు పార్టీల మధ్య మంత్రిపదవుల పంపిణీపై డీల్ కుదిరింది. ఈ డీల్ ప్రకారం మొత్తం 34 మంత్రిదవుల్లో కాంగ్రెస్‌కు 22, జేడీఎస్‌కు 12 చొప్పున ఇచ్చిపుచ్చుకోవాలని నిర్ణయించాయి. అలాగే, ముఖ్యమంత్రిగా కుమార స్వామి, ఉప ముఖ్యమంత్రిగా పరమేశ్వరలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
 
అలాగే, ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్‌కు స్పీకర్, జేడీఎస్‌కు డిప్యూటీ స్పీకర్‌ పదవులు దక్కాయి. స్పీకర్‌గా కాంగ్రెస్‌ నేత కేఆర్‌ రమేశ్‌ కుమార్‌ను ఈ నెల 25న ఎన్నుకోనున్నారు. బల నిరూపణ తర్వాతే మంత్రి పదవుల అంశంలో శాఖల కేటాయింపుల ప్రక్రియ ఉంటుందని కాంగ్రెస్‌ నేత కేసీ వేణుగోపాల్‌ తెలిపారు. కాగా, కుమారస్వామి ఈ నెల 24న బలపరీక్ష ఎదుర్కోనున్నారు. 
 
మరోవైపు, ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి కాంగ్రెస్ అతిరథలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఆ పార్టీ సీనియర్ నేతలు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ, బీఎస్పీ అధినేత్రి మాయావతితో పాటు... ఇతర పార్టీల నేతలు హాజరుకానున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

పుష్ప 2కు ముందే వైల్డ్ ఫైర్ షో చేశాం - సినిమాలూ చేస్తున్నా : ఫరియా అబ్దుల్లా

తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలో క్రైమ్ థ్రిల్లర్ అసుర సంహారం

ఆ హీరోతో రశ్మిక మందన్నా డేటింగ్ లో వున్నమాట నిజమేన !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

మండుతున్న అగ్నిగోళం నుంచి చందమామ చల్లగా ఎలా మారాడు? 4.5 బిలియన్ ఏళ్ల క్రితం (video)

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments