Webdunia - Bharat's app for daily news and videos

Install App

సేవింగ్ ఖాతాలపై స్టేట్ బ్యాంకు బాదుడే బాదుడు...

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (07:25 IST)
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకు ఖాతాదారులపై భారాన్ని మోపేందుకు సిద్ధమైంది. జూన్ ఒకటో తేదీ నుంచి ఈ భారం మోపేందుకు శ్రీకారం చుట్టనుంది. 
 
ఎస్పీఐ బ్యాంకుల్లో ఉండే బేసిక్‌ సేవింగ్స్‌ బ్యాంక్‌ డిపాజిట్‌ (బీఎస్‌బీడీ) ఖాతాల ఛార్జీలను జూలై 1 నుంచి ఎస్‌బీఐ సవరిస్తుంది. వీరి ఉచిత నగదు ఉపసంహరణ (విత్‌డ్రాయల్స్‌) సదుపాయాన్ని నెలకు గరిష్టంగా నాలుగుకు మాత్రమే పరిమితం చేస్తోంది. 
 
ఆ పరిమితి మించితే ప్రతి నగదు ఉపసంహరణపైనా రూ.15 ప్లస్‌ జీఎస్‌టీని కలిపి వసూలు చేయనుంది. బ్యాంక్‌ శాఖలు, ఏటీఎంలు, ఇరత బ్యాంకుల ఏటీఎంల నుంచి చేసే అన్ని అదనపు నగదు విత్‌డ్రాయల్స్‌కూ ఈ ఛార్జీలు వర్తిస్తాయి.  
 
అదేవిధంగా ఇకపై పరిమితికి మించి చెక్కులు కావాలన్నా కూడా చేతి చమురు వదిలించుకోవాల్సిందే. ప్రస్తుతం బీఎస్‌బీడీ ఖాతాదారులకు ప్రస్తుతం ఏడాదికి 10 లీఫ్స్‌ ఉండే ఒక చెక్‌బుక్‌‌ను ఎస్‌బీఐ ఉచితంగా జారీ చేస్తోంది. 
 
జూలై 1 నుంచి ఆ పరిమితి మించితే 10 లీఫ్స్‌ చెక్‌బుక్‌కు రూ.40 ప్లస్‌ జీఎస్టీ, 25 లీఫ్స్‌ చెక్‌బుక్‌కు రూ.75 ప్లస్‌ జీఎస్‌టీ చెల్లించాలి. అత్యవసరంగా 10 లీఫ్స్‌ చెక్‌బుక్‌ కావాలన్నా బీఎస్‌బీడీ ఖాతాదారులు రూ.50 ప్లస్‌ జీఎస్‌టీ చెల్లించాలి. అయితే సీనియర్‌ సిటిజన్లను ఈ అదనపు చెక్‌బుక్‌ చార్జీల నుంచి మినహాయిస్తున్నట్టు ఎస్‌బీఐ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments