Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముడి చమురు ఉత్పత్తి పెంచాలన్న భారత్.. వ్యంగ్యంగా బదులిచ్చిన సౌదీ!

Webdunia
శనివారం, 6 మార్చి 2021 (11:53 IST)
దేశంలో పెట్రోల్ ధరలు విపరీతంగా మండిపోతున్నాయి. దీనికి కారణం ఓపెక్ దేశాలు ముడి చమురు ఉత్పత్తిని గణనీయంగా తగ్గించడమే. కరోనా సాకు చూపిన ఓపెక్ దేశాలు ముడి చమురు ఉత్పత్తిని చాలా మేరకు తగ్గించాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు బ్యారెల్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో దేశీయంగా కూడా చమురు ధరలు ఆకాశానికి తాకాయి. 
 
ఈ నేపథ్యంలో చమురు ఉత్పత్తి పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఒపెక్ (పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ) దేశాలను కోరింది. అయితే, ఒపెక్ దేశాల్లో కీలకమైన సౌదీ అరేబియా చాలా వ్యంగ్యంగా సమాధానమిచ్చింది. గతేడాది తమ నుంచి అత్యంత చవకగా కొనుగోలు చేసి దాచుకున్న చమురును ఇప్పుడు బయటికి తీసి వాడుకోవాలని సూచించింది.
 
కరోనా వ్యాప్తి నేపథ్యంలో నెలకొన్న సంక్షోభం రీత్యా ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఈ దేశాలు లాభాపేక్షతో వ్యవహరిస్తూ పరిమిత మొత్తంలో చమురును ఉత్పత్తి చేస్తుండటంతో ఇంధనాన్ని అధికమొత్తంలో దిగుమతి చేసుకునే భారత్ వంటి దేశాల్లో పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి.
 
ఒపెక్ సభ్యదేశాలతో సమావేశం సందర్భంగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉత్పత్తిని పునరుద్ధరించాలని కోరారు. ధరల స్థిరీకరణ చేస్తామని ప్రజలకిచ్చిన హామీ నెరవేర్చడంలో సహకరించాలని ఆయా దేశాలకు విజ్ఞప్తి చేశారు.
 
అందుకు సౌదీ అరేబియా ఇంధన శాఖ మంత్రి ప్రిన్స్ అబ్దులజీజ్ బిన్ సల్మాన్ స్పందిస్తూ... భారత్ కిందటేడాది తమ నుంచి అతి తక్కువ ధరలకే భారీ మొత్తంలో చమురు కొనుగోలు చేసి నిల్వ చేసిందని వెల్లడించారు. ఇప్పుడా నిల్వల నుంచి చమురును బయటికి తీసి ఉపయోగించుకోవాలని అన్నారు. తమ మిత్రదేశం భారత్ ఎదుర్కొంటున్న సమస్యకు ఇంతకంటే తరుణోపాయం లేదన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments