రిలయన్స్ జియో రూ.799 రీచార్జ్ ప్లాన్‌ను రద్దు చేసిందా?

ఠాగూర్
గురువారం, 21 ఆగస్టు 2025 (18:41 IST)
ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో అందుబాటులో ఉన్న రూ.799 రీజార్జ్ ప్లాన్‌ను రద్దు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆ కంపెనీ తాజాగా వివరణ ఇచ్చింది. రూ.799 రీచార్జ్ ప్లాన్ రద్దు చేసినట్టు జరుగుతున్న ప్రచారాన్ని జియో తోసిపుచ్చింది. ఆ ప్లాన్ కొనసాగుతుందని, యూజర్లు ఎప్పటిలానే రీచార్జి చేసుకోవచ్చని స్పష్టత నిచ్చింది. జియో వెబ్‌సైట్‌తో పాటు ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి పేమెంట్ ఫ్లాట్‌ఫామ్‌లలో ఈ ప్లాన్‌తో అందుబాటులోనే ఉంచినట్టు వివరణ ఇచ్చింది. 
 
యూజర్లు అవసరాలకు అనుగుణంగా అందుబాటు ధరలో రీచార్జి ప్లాన్‌లను అందించేందుకు కట్టుబడివున్నట్టు జియో పేర్కొంది. రూ.799 ప్లాన్‌తో రీచార్జి‌తో రీచార్జి చేసుకుంటే 84 రోజుల కాలపరిమితి పొందవచ్చని పేర్కొంది. ఈ ప్లాన్ కింద రోజుకు 1.5 జీబీ డేటాతో పాటు అపరిమిత కాల్స్ చేసుకోవచ్చని వివరించింది. అదేవిధంగా ఈ ప్లాన్‌లో రోజుకు వంద ఎస్ఎంఎస్‌లు పొందవచ్చని రిలయన్స్ జియో విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments