Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్నెట్ బ్యాంకింగ్‌‌తో చెల్లింపులు చేసేవారికి గుడ్ న్యూస్

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2020 (18:52 IST)
మొబైల్ వ్యాలెట్లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌తో చెల్లింపులు చేసేవాళ్లకి శుభవార్త. జనవరి 2020 నుండి యుపిఐ లావాదేవీలపై విధించిన రుసుమును తిరిగి కస్టమర్లకు చెల్లించాలని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ బ్యాంకులను ఆదేశించింది. భీమ్‌-యూపీఐ, రూపే, యూపీఐ క్యూఆర్‌ కోడ్‌.. తదితరాలు ఉపయోగించి డిజిటల్‌ విధానాల్లో జరిపిన ఆర్థిక లావాదేవీలపై వినియోగదారులకు ఈ వెసులుబాటు దక్కుతుంది. 
 
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) బ్యాంకులను ఈ మేరకు సర్యులర్‌ జారీ చేసింది. ఈ డిజిటల్‌ చెల్లింపులపై భవిష్యత్తులో కూడా ఎలాంటి చార్జీలు వసూలు చేయరాదని తేల్చి చెప్పింది. డిజిటల్‌ ఆర్థిక లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం 2019లో ఫైనాన్స్‌ యాక్ట్‌-2019లో సెక్షన్‌ 269 ఎస్‌యూ చేర్చింది. 
 
ఫలితంగా భీమ్‌-యూపీఐ, రూపే-డెబిట్‌కార్డ్‌, యూపీఐ క్యూఆర్‌ కోడ్‌ లావాదేవీలను ఈ సెక్షన్‌ కింద నోటిఫై చేసింది. దాంతో ఈ మార్గాల్లో చేసే చెల్లింపులకు చార్జీలు వసూలు చేయకూడదు. కానీ కొన్ని బ్యాంకులు చార్జీలు వసూలు చేస్తుండటంతో సీబీడీటీ తాజాగా ఈ సర్క్యులర్‌ను జారీచేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments