Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశవ్యాప్తంగా ఏటీఎంలను మూసివేయండి : ఆర్బీఐ

భారత రిజర్వు బ్యాంకు కీలక ఆదేశాలు జారీచేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలను తక్షణం మూసివేయాల్సిందిగా స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా మాల్‌వేర్ దాడులు బ్యాంకింగ్ నెట్‌వర్క్‌ను సైతం అతలాకుతలం చేస్తున్న

Webdunia
సోమవారం, 15 మే 2017 (11:42 IST)
భారత రిజర్వు బ్యాంకు కీలక ఆదేశాలు జారీచేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలను తక్షణం మూసివేయాల్సిందిగా స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా మాల్‌వేర్ దాడులు బ్యాంకింగ్ నెట్‌వర్క్‌ను సైతం అతలాకుతలం చేస్తున్న విషయం తెల్సిందే. 
 
'వాన్నా క్రై' బీభత్సం బ్యాంకిక్ నెట్‌వర్క్‌ను తాకకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. విండోస్ అప్‌డేషన్ వచ్చేంతవరకూ బ్యాంకులన్నీ తమ ఏటీఎంలను మూసివేయాలని ఆదేశాలు జారీచేసింది. వాన్నా క్రై రాన్సమ్‌వేర్ ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ సహా వివిధ రంగాల కంప్యూటర్ నెట్‌వర్క్‌లను అతలాకుతలం చేసి, కీలకమైన డాటా మూసుకుపోయేలా చేసి పెద్దమొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో ఆర్బీఐ ఈ చర్యలకు దిగింది. 
 
మనదేశంలోని దాదాపు అన్ని ఏటీఎంలు విండోస్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌తోనే పనిచేస్తున్నాయి. అదీగాక దేశంలోని 2.25 లక్షల ఏటీఎంలలో 60 శాతం ఏటీఎంలు ఔట్‌డేటెడ్ విండోస్ ఎక్స్‌పీపైనే ఆధారపడుతున్నాయి. దీంతో ఈ నెట్‌వర్క్‌పై మాల్‌వేర్ సులభంగా దాడి చేసే అవకాశం ఉందని ఆర్బీఐ హెచ్చరించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం