రైల్వే ప్రయాణికులకు శుభవార్త: అందుబాటులోకి రెగ్యులర్ రైళ్లు

Webdunia
శనివారం, 13 నవంబరు 2021 (11:48 IST)
రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది రైల్వే శాఖ. లాక్‌డౌన్ కారణంగా ఆగిపోయిన రెగ్యులర్ సర్వీసులు త్వరలోనే మొదలు కానుంది. కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది మూడు నెలల పాటు దేశానికి తాళం పడిన సంగతి తెలిసిందే. 
 
దీని కారణంగా దేశ వ్యాప్తంగా ఉన్న ప్యాసింజర్ రైళ్ల సర్వీసులను నిలిపివేసింది రైల్వే శాఖ. రైలు సర్వీసులను తిరిగి ప్రారంభించింది. అయితే రెగ్యులర్ రైలు మాత్రం అందుబాటులోకి రాలేదు. టికెట్ ధరపై 30 శాతం అధిక ధరతో వివిధ రూట్లలో ప్రత్యేక రైళ్లను నడిపిస్తూ వచ్చింది రైల్వే శాఖ. 
 
కరోనాకు ముందు దేశవ్యాప్తంగా నిత్యం 1700 మెయిల్ ఎక్స్‌ప్రెస్‌లు, ముప్పై ఐదు వందల ప్యాసింజర్ రైళ్లు నడిచేవి. కరోనా ఆంక్షల కారణంగా ఆ సర్వీసులు అన్నీ నిలిచిపోయాయి. ప్రత్యేక రైళ్లలో 95శాతం మెయిల్ రైళ్లు అందుబాటులో ఉండగా 25శాతం రైలు ఇతర కేటగిరీలలో సేవలను అందిస్తున్నాయి. ప్యాసింజర్ రైళ్లను కేవలం వెయ్యి మాత్రమే నడుస్తున్నాయి.
 
70శాతం ప్యాసింజర్ రైలు ఎక్స్‌ప్రెస్ హోదా ఇచ్చి అదే స్థాయిలో టికెట్ ధరను కూడా వసూలు చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ ఆదేశాలు రద్దు చేయడంతో పాటు రెగ్యులర్ రైళ్లను అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌. దీంతో ప్రయాణీకులకు ఊరట కలుగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: యుద్దం నేపథ్యంలో శంబాల ట్రైలర్‌.. ఆవిష్కరించిన ప్రభాస్

Allari Naresh: ప్రేమ, థ్రిల్ ఎలిమెంట్స్ తో అల్లరి నరేష్ 12A రైల్వే కాలనీ

Bhagyashree Borse: నక్షత్రాల మధ్య ఆటలాడుతూ, వెన్నెల్లో తేలియాడుతూ.. రామ్, భాగ్యశ్రీ బోర్సే

Mass Jatara Review: జరుగుతున్న కథతో ఫ్యాన్స్ ఫార్ములాగా మాస్ జాతర - మూవీ రివ్యూ

Allu Sirish and Nayanika: నయనిక రెడ్డితో అల్లు శిరీష్.. తారల సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments