Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ కారణంగా భారీగా పెరిగిన క‌రోనా మరణాలు... దేశంలో అదుపులోనే!

Webdunia
శనివారం, 13 నవంబరు 2021 (11:18 IST)
క‌రోనా మ‌ర‌ణాలు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో, భార‌త‌ దేశంలో గత కొద్దికాలంగా కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. క్రియాశీల రేటు ఊరటనిస్తుండగా, రికవరీ రేటు రోజురోజుకూ మెరుగవుతోంది. ఈ మేరకు శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను విడుదల చేసింది.
 
 
శుక్రవారం 12,66,589 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 11,850 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. కిందటి రోజు కంటే 5 శాతం మేర కేసులు తగ్గాయి. గత ఏడాది ప్రారంభం నుంచి 3.44 కోట్ల మందికి కరోనా సోకింది. వారిలో 3.38 కోట్ల మంది కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే 12,403 మంది వైరస్ నుంచి బయటపడ్డారు.
 
 
గత కొద్దికాలంగా కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉండటంతో క్రియాశీల రేటు 0.40 శాతానికి చేరగా.. రికవరీ రేటు 98.26 శాతానికి పెరిగింది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 1,36,308గా ఉంది. అవి 274 రోజుల కనిష్ఠానికి తగ్గుముఖం పట్టాయి. ఇక రోజూమాదిరిగానే మరణాల సంఖ్యపై కేరళ గణాంకాల ప్రభావం పడింది. దాంతో మృతుల సంఖ్య భారీగా పెరిగి..555కి చేరింది. ఇప్పటివరకు 4,63,245 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు.  మరోపక్క నిన్న 58.42 లక్షల మంది టీకా వేయించుకోగా.. మొత్తంగా 111 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ అయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నువ్వసలు తెలుగేనా? నీ యాక్సెంట్ తేడాగా వుంది: మంచు లక్ష్మికి అల్లు అర్హ షాక్ (video)

పెళ్లిలో పెళ్లి టైటిల్ చాలా ఆసక్తికరంగా వుంది : తనికెళ్ళ భరణి

అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చేవారు : స్మృతి ఇరానీ

Anjali: అంజలి లీడ్ రోల్ లో డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులిచర్ల చిత్రం

అఖండ2 కి నందమూరి బాలకృష్ణ డబ్బింగ్ పూర్తి చేశారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

తర్వాతి కథనం
Show comments