Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే బోర్డు సీఈవోగా తొలిసారి ఓ మహిళకు ఛాన్స్

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2023 (16:57 IST)
రైల్వే బోర్డు ఛైర్ పర్సన్, సీఈవోగా దేశంలో తొలిసారి ఓ మహిళకు కేంద్రం అవకాశం ఇచ్చింది. రైల్వే బోర్డు కొత్త సీఈవోగా జయావర్మ సిన్హాను ఎంపిక చేశారు. ఇప్పటివరకు ఆమె రైల్వే బోర్డు సభ్యురాలిగా కొనసాగుతూ వచ్చారు. రైల్వే బోర్డు ఛైర్మన్‌గా ఉన్న అనిల్ కుమార్ లహోటి పదవీకాలం ముగియడంతో ఆ స్థానాన్ని రైల్వే బోర్డు సభ్యురాలిగా ఉన్న జయా వర్మ సిన్హాతో భర్తీ చేశారు. రైల్వే బోర్డు చరిత్రలో ఓ మహిళ చైర్‌పర్సన్‌గా, సీఈవోగా నియమితులు కావడం దేశంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
ఈమె రైల్వేలో ట్రాఫిక్ విభాగంలో అధికారిణి. ప్రస్తుతం రైల్వే బోర్డులో కార్యకలాపాలు - వ్యాపార ఆభివృద్ధి విభాగం సభ్యురాలిగా ఉన్నారు. ఆమెను రైల్వే బోర్డు కొత్ చీఫ్‌గా నియమిస్తున్నట్టు రైల్వేశాఖ విడుదల చేసి ఓ ప్రకటనలో తెలిపింది. ఆమె నియామకానికి కేంద్ర నియామకాల కమిటీ కూడా ఆమోదం తెలిపింది. ఈమె వచ్చే యేడాది ఆగస్టు 31వ తేదీ వరకు ఈ పదవిలో కొనసాగుతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments