Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైల్వే బోర్డు సీఈవోగా తొలిసారి ఓ మహిళకు ఛాన్స్

Webdunia
గురువారం, 31 ఆగస్టు 2023 (16:57 IST)
రైల్వే బోర్డు ఛైర్ పర్సన్, సీఈవోగా దేశంలో తొలిసారి ఓ మహిళకు కేంద్రం అవకాశం ఇచ్చింది. రైల్వే బోర్డు కొత్త సీఈవోగా జయావర్మ సిన్హాను ఎంపిక చేశారు. ఇప్పటివరకు ఆమె రైల్వే బోర్డు సభ్యురాలిగా కొనసాగుతూ వచ్చారు. రైల్వే బోర్డు ఛైర్మన్‌గా ఉన్న అనిల్ కుమార్ లహోటి పదవీకాలం ముగియడంతో ఆ స్థానాన్ని రైల్వే బోర్డు సభ్యురాలిగా ఉన్న జయా వర్మ సిన్హాతో భర్తీ చేశారు. రైల్వే బోర్డు చరిత్రలో ఓ మహిళ చైర్‌పర్సన్‌గా, సీఈవోగా నియమితులు కావడం దేశంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
ఈమె రైల్వేలో ట్రాఫిక్ విభాగంలో అధికారిణి. ప్రస్తుతం రైల్వే బోర్డులో కార్యకలాపాలు - వ్యాపార ఆభివృద్ధి విభాగం సభ్యురాలిగా ఉన్నారు. ఆమెను రైల్వే బోర్డు కొత్ చీఫ్‌గా నియమిస్తున్నట్టు రైల్వేశాఖ విడుదల చేసి ఓ ప్రకటనలో తెలిపింది. ఆమె నియామకానికి కేంద్ర నియామకాల కమిటీ కూడా ఆమోదం తెలిపింది. ఈమె వచ్చే యేడాది ఆగస్టు 31వ తేదీ వరకు ఈ పదవిలో కొనసాగుతారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments