Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైలు ప్రయాణీకులకు షాక్.. యూడీఎఫ్ చెల్లించాలట.. ఛార్జీలు పెరుగుతాయట!

Webdunia
మంగళవారం, 25 ఆగస్టు 2020 (14:20 IST)
రైలు ప్రయాణీకులకు పెద్ద షాక్ తప్పేలా లేదు. కరోనా నేపథ్యంలో రైళ్ల రాకపోకలు ఆగపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టులో వసూలు చేసినట్టు ఇకపై రైల్వే స్టేషన్లలో కూడా యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు-యూడీఎఫ్ చెల్లించాల్సి వస్తుందన్న వార్తలొస్తున్నాయి. అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో యూజర్ డెవలప్‌మెంట్ ఫీజును ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది భారతీయ రైల్వే. 
 
ఆ రైల్వే స్టేషన్లలోకి ఎంటరైతే ఈ ఛార్జీలు చెల్లించక తప్పదు. అయితే ఎంత ఛార్జీలు వసూలు చేస్తారన్న స్పష్టత లేదు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి భారతీయ రైల్వే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశముంది. అయితే ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్రైవేట్ సంస్థల ద్వారా ఆధునిక సదుపాయాలు కల్పిస్తే యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు వసూలు చేస్తుంది రైల్వే.
 
పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‍షిప్‌లో భాగంగా ఈ ప్రాజెక్టుల్ని రైల్వే చేపట్టనుంది. బిడ్డింగ్ ద్వారా ప్రైవేట్ సంస్థలు ఈ పనులను చేజిక్కించుకుంటారు. ప్రధాన రైల్వే స్టేషన్లను ఆధునీకరించి కమర్షియల్ కాంప్లెక్సులు, యూజర్ ఫీజుల ద్వారా లాభాలు పొందుతారు. అలాగే ప్రైవేట్ సంస్థలు ఆధునీకరించే రైల్వే స్టేషన్లలో కూడా యూజర్ డెవలప్‌మెంట్ ఫీజుల్ని రైలు ప్రయాణికులు చెల్లించక తప్పదు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram: రామ్, ఉపేంద్ర, సత్య పై రాజమండ్రిలో ఆంధ్రా కింగ్ తాలూకా షెడ్యూల్

తరుణ్ భాస్కర్, సురేష్ ప్రొడక్షన్స్, కల్ట్ సీక్వెల్ ENE రిపీట్ అనౌన్స్‌మెంట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments