రూ.2 వేల నోట్లను వదిలించుకోవడానికి కంపెనీ యజమానుల కొత్త ఎత్తుగడ... ఏంటది?

Webdunia
శుక్రవారం, 2 జూన్ 2023 (15:04 IST)
భారత రిజర్వు బ్యాంకు ఆదేశాల మేరకు సెప్టెంబరు నెలాఖరుతో దేశ వ్యాప్తంగా చెలామణిలో ఉన్న రూ.2 వేల నోటు రద్దు కానుంది. తమ వద్ద ఉన్న రూ.2 వేల నోటును ఈ గడువు లోగా బ్యాంకుల్లో మార్చుకోవాల్సి వుంది. ఈ నేపథ్యంలో అనేక కంపెనీల యజమానులు తమ వద్ద మూలుగుతున్న రూ.2 వేల నోట్లను మార్చుకునేందుకు కొత్త ఎత్తుగడను అనుసరిస్తున్నాయి. 
 
నిన్నామొన్నటి వరకు బంగారం, స్థిరాస్తి కొనుగోళ్లపై దృష్టి పెట్టిన యజమానులు ఇపుడు తమ వద్ద పని చేసే ఉద్యోగులకు రూ.2 వేల నోట్లను వేతనాలుగా ఇస్తున్నాయి. పైగా, ఇప్పటివరకు ఐదు నుంచి పదో తేదీ వరకు చెల్లించే వేతనాలను ఇపుడు ఒకటో తేదీనే ఠంచనుగా ఇచ్చి, స్వామి కార్యం స్వకార్యం పూర్తయిందని చేతులు దులిపేసుకుంటున్నారు. 
 
సాధారణంగా ప్రతినెలా నాలుగు, ఐదో తేదీల్లో వేతనాలు ఇస్తుండగా మే నెల జీతం జూన్‌ ఒకటో తేదీనే ఇవ్వడంతో ముందే ఇస్తున్నారన్న సంతోషంతో వాటిని తీసుకున్నామని ఆ ఉద్యోగులు చెబుతున్నారు. మరికొందరు వేతనం రూ.10 వేలు ఉంటే రూ.20 వేలు చేతిలో పెట్టి మరో పదివేలు బ్యాంకులో మార్చుకొని రావాలని ఆదేశిస్తున్నారని తెలిపారు. ఇలా జూన్‌ ఒకటో తేదీన నగరంలో కోట్లాది రూపాయలు చేతులు మారినట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments