Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ ఆతిథ్య రంగ ముఖ చిత్రాన్ని మార్చిన పీఆర్ఎస్ ఓబెరాయ్ ఇకలేరు...

Webdunia
మంగళవారం, 14 నవంబరు 2023 (12:25 IST)
భారత దేశ హోటల్ వ్యాపార ముఖ చిత్రాన్ని మార్చిన పారిశ్రామికవేత్తల్లో ఒకరు, ఒబెరాయ్ హోటల్స్ వ్యవస్థాపకుల్లో ఒకరైన పీఎస్ఆర్ ఒబెరాయ్ ఇకలేరు. 94 యేళ్ళ వయసులో ఆయన తుదిశ్వాస విడిచారని ఒబెరాయ్ గ్రూపు ఓ ప్రకటనలో తెలిపింది. ఆయన అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం జరుగనున్నాయి. తమ ప్రియతమ నాయకుడు పీఆర్ఎస్ ఒబెరాయ్ కన్నుమూశారని తీవ్ర విచారంతో తెలియజేస్తున్నామని ఆ గ్రూపు అధికార ప్రతినిధి వెల్లడించారు.
 
ఆయన మరణం ఒబెరాయ్ గ్రూపుతో పాటు భారత్, విదేశీ ఆతిథ్య రంగానికి తీవ్రమైన నష్టమని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అంత్యక్రియలను మంగళవారం సాయంత్రం 4 గంటలకు జరుగుతాయని తెలిపారు. ఢిల్లీలోని కపషేరాలో ఉన్న భగవంతి ఒబెరాయ్ చారిటబుల్ ట్రస్ట్ ఫామ్‌లో ఈ అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 
 
కాగా, పీఆర్ఎస్ ఒబెరాయ్ దూరదృష్టి గల నాయకుడు అని, అంకితభావం, మక్కువతో ఒబెరాయ్ గ్రూపు హోటళ్ళను ప్రపంచ వ్యాప్తంగా తీర్చిదిద్దారని ఓ ప్రకటనలో పేర్కొంది. ఆయన విస్తరించిన హోటళ్ళు భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆతిథ్య రంగాన్ని ప్రభావితం చేస్తాయని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా, పీఆర్ఎస్ ఒబెరాయ్ దేశీయ హోటల్ వ్యాపార ముఖచిత్రానికి కొత్త రూపు తీసుకొచ్చి, ప్రత్యేక గుర్తింపును అందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Virgin: ఫోన్ల వర్షం - కానుకల వర్షంతో ప్రేక్షకులకు ఆఫర్ ఇస్తున్న వర్జిన్ బాయ్స్ టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments