Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్రం షాక్ : రూ.2 వేల నోటు ముద్రణ నిలిపివేత

Webdunia
శనివారం, 5 జనవరి 2019 (09:10 IST)
దేశ ప్రజలకు కేంద్రం షాకిచ్చింది. రూ.2 వేల నోటు ముద్రణను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ ట్వీట్ చేశారు. ఆర్థిక వ్యవస్థలో రూ.2 వేల నోట్లు తగిన స్థాయిలో ఉన్నందున ప్రస్తుతానికి వాటి ముద్రణను నిలిపివేసినట్లు ఆయన తెలిపారు.
 
ప్రస్తుతం దేశంలో రూ.2 వేల నోటు చలామణిలో ఉంది. ఈ నోటును కూడా చలామణి నుంచి తీసేస్తారంటూ సాగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. భవిష్యత్తు అవసరాలను అంచనా వేసి కరెన్సీ నోట్ల ముద్రణకు ప్రణాళిక రచిస్తామన్నారు. 'మన వ్యవస్థలో అవసరమైన దానికన్నా ఎక్కువ మొత్తంలో రెండు వేల నోట్లు ఉన్నాయి. ప్రస్తుతం చలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్లలో విలువపరంగా చూస్తే, 35 శాతానికి పైగా వాటా రెండు వేల నోట్లదే. రెండు వేల నోట్ల ముద్రణ విషయంలో ఇటీవల ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు' అని చెప్పారు. 
 
కాగా, దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశంలో నల్లధనాన్ని అరికట్టే చర్యల్లో భాగంగా చలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్ల ముద్రణను నిలిపివేసిన విషయం తెల్సిందే. పెద్ద నోట్ల రద్దు సమయంలో మన ఆర్థిక వ్యవస్థలో దాదాపు 86 శాతం వాటా రూ.100, రూ.500 నోట్లదే కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments