Webdunia - Bharat's app for daily news and videos

Install App

అడ్వాన్స్ రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన రైల్వే శాఖ... రైలు రాకపోకలపై...

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (20:08 IST)
కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా దేశ వ్యాప్త లాక్‌డౌన్ అమలవుతోంది. దీంతో రైళ్ళ రాకపోకలు కూడా పూర్తిగా ఆగిపోయాయి. ఈ నెల 14వ తేదీ వరకు ఇదే పరిస్థితి కొనసాగనుంది. అయితే 15వ తేదీ నుంచి యధావిధిగా రైళ్ళ రాకపోకలు కొనసాగుతాయనీ, ఇందుకోసం గురువారం నుంచి అడ్వాన్స్ రిజర్వేషన్లు చేసుకునేందుకు రైల్వే శాఖ అనుమతి ఇచ్చిందంటూ వార్తలు వచ్చాయి. వీటిపై రైల్వే శాఖ గురువారం ఓ క్లారిటీ ఇచ్చింది. 
 
లాక్‌డౌన్ ముగిసిన తర్వాత ఈ నెల 15వ తేదీ తర్వాతి ప్రయాణాలకు రైల్వే రిజర్వేషన్ల ప్రక్రియ మొదలైనందని వార్తలు వచ్చాయి. ఈ వార్తల్లో నిజం లేదనని చెప్పింది. తాము కొత్తగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. ఏప్రిల్ 14వ తర్వాతి ప్రయాణాల కోసం రిజర్వేషన్లు, టికెట్ల బుకింగ్స్‌ను తాము నిలిపివేయనే లేదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. 
 
కేవలం లాక్‌డౌన్ అమలులో ఉన్న సమయయానికి అంటే మార్చి 24 నుంచి ఏప్రిల్ 14వ తేదీల మధ్యలో ప్రయాణాల బుకింగ్స్‌ను మాత్రమే నిలిపివేశామని చెప్పింది. రైల్వే టికెట్ల కోసం 120 రోజుల ముందు నుంచే అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ ఉంటుందని తెలిపింది. అందువల్ల ఏప్రిల్ 15 తర్వాత జరిగే ప్రయాణాల కోసం లాక్‌డౌన్‌ విధించే చాలా రోజుల ముందు నుంచే బుకింగ్స్‌ ఓపెన్‌గా ఉన్నాయని పేర్కొన్నది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments