Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడు ప్రజలపై సర్కారు భారీ వడ్డన.. అమాంతం పెరిగిన పెట్రోల్ ధరలు

తమిళనాడు రాష్ట్రంలోని ముఖ్యమంత్రి పళనిస్వామి సర్కారు భారం మోపింది. పెట్రోల్, డీజిల్‌పై వసూలు చేసే విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను భారీగా పెంచింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు ఏకంగా రూ.3 మేరకు పెరిగాయి.

Webdunia
ఆదివారం, 5 మార్చి 2017 (15:31 IST)
తమిళనాడు రాష్ట్రంలోని ముఖ్యమంత్రి పళనిస్వామి సర్కారు భారం మోపింది. పెట్రోల్, డీజిల్‌పై వసూలు చేసే విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను భారీగా పెంచింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు ఏకంగా రూ.3 మేరకు పెరిగాయి. 
 
తమిళనాడు ప్రభుత్వం పెట్రోల్‌పై వ్యాట్‌ను 27 శాతం వసూలు చేస్తుండగా దీన్ని 34 శాతానికి పెంచింది. అలాగే, డీజిల్‌పై 21.4 శాతంగా ఉన్న వ్యాట్‌ను 25 శాతానికి పెంచింది. దీంతో లీటరు పెట్రోలు ధర రూ.3.78కి, డీజిల్ ధర రూ.1.70కు పెరిగింది. అంటే చెన్నైలో లీటరు పెట్రోలు ధర రూ.75కు, లీటరు డీజిల్ ధర రూ.63.96కు చేరింది.
 
ప్రభుత్వ నిర్ణయాన్ని తమిళనాడు పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఖండించింది. అన్ని వర్గాల ప్రజలపైనా తీవ్రమైన భారం పడుతుందని, ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేసింది. పెట్రోలు ధర పెరుగుదల వల్ల వాహనదారులపై ప్రభావం పడుతుందని, డీజిలు ధర పెరగడం వల్ల కూరగాయలు, సరకులు, వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments