Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ చరిత్రలో తొలిసారి.. పెట్రోల్ - డీజిల్ ధరలు సమానం

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (11:51 IST)
దేశ చరిత్రలో తొలిసారి ఓ రికార్డు నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు సమానమయ్యాయి. గత 17 రోజులుగా పెరుగుతూ వచ్చాయి. బుధవారం అంటే 18వ రోజు కూడా ఈ ధరలు పెట్రో ధరలు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెంచాయి. ఫలితంగా దేశంలో తొలిసారిగా పెట్రోల్, డీజిల్ ధరలు సమానమయ్యాయి. 
 
దేశంలో లాక్డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత, నిత్యమూ 'పెట్రో' ధరలను పెంచుకుంటూ పోతుండగా, ఈ 19 రోజుల వ్యవధిలో పెట్రోల్, డీజిల్‌పై దాదాపు రూ.10 వరకూ ధర పెరిగింది. ఇదేసమయంలో ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు సమానమయ్యాయి. 
 
ప్రస్తుతం హస్తినలో పెట్రోలు ధర లీటరుకు రూ.79.88వుండగా, డీజిల్ ధర రూ.79.40కి చేరుకుంది. ఏ దేశంలోనైనా పెట్రోల్‌తో పోలిస్తే, డీజిల్ ధర తక్కువగా ఉంటుంది. 
 
అయితే, ఢిల్లీలో డీజిల్ వాహనాల సంఖ్య భారీ‌గా పెరిగిపోవడంతో ప్రభుత్వం డీజిల్‌పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను పెంచుకుంటూ వెళ్లింది. దీంతో రెండు ఇంధనాల ధరా సమానమైంది. 
 
కాగా, ఇతర మెట్రో నగరాలైన హైదరాబాద్, కోల్ కతా, చెన్నై, ముంబై తదితర ప్రాంతాల్లో మాత్రం ఈ పరిస్థితి ఇంకా రాలేదు. ఈ నగరాల్లో మాత్రం వీటి ధరల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments