ఆధార్ - పాన్ కార్డు అనుసంధానానికి తుది గడువు ఇదే...

Webdunia
ఆదివారం, 20 నవంబరు 2022 (10:17 IST)
పాన్ కార్డు, ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవడానికి ఆదాయాపన్ను శాఖ చివరి అవకాశాన్ని కల్పించింది. వచ్చే యేడాది మార్చి 31వ తేదీ తర్వాత ఆధార్‌ కార్డుతో పాన్ కార్డును లింకు చేయడం సాధ్యంకాదని ఐటీ శాఖ హెచ్చరిస్తుంది. 
 
నిజానికి ఈ రెండు నంబర్ల అనుసంధానానికి ఇప్పటికే పలుమార్లు ఆదాయపన్ను శాఖ గడువు ఇచ్చింది. పలు మార్లు పొడగించింది కూడా. ఈ నేపథ్యంలో మరోమారు గడవు పొడగించే ప్రసక్తే లేదని ఐటీ శాఖ స్పష్టం చేసింది. అందువల్ల 2023 మార్చి 31వ తేదీలోపు పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానం చేయాలని తెలిపింది. 
 
ఈ యేడాది జూన్ వరకు పాన్ కార్డుతో ఆధార్‌తో లింకు చేసుకోవడానికి ఆదాయపన్ను శాఖ ఉచితంగా అవకాశం కల్పించింది. జూన్ తర్వాత ఈ లింకు కోసం రూ.వెయ్యి చొప్పున సూలు చేస్తుంది. వచ్చే యేడాది మార్చి వరకు రూ.వెయ్యి చెల్లించి పాన్ కార్డు, ఆధార్ లింకు చేసుకోవచ్చని చెబుతోంది. 
 
ఈ రెండు నంబర్లను మీరు కూడా స్వయంగా చేసుకోవచ్చు. 
ఆదాయపన్ను శాఖ వెబ్‌సైట్‌కి వెళ్లి క్విక్ లింక్ విభాగంలో లింక్ ఆధారం ఎంపికై క్లిక్ చేయాలి. అక్కడ పాన్ నంబరును, ఆధార్ నంబరును, ఇతర వివరాలను నమోదు చేయాలి. ఆధార్ వివరాలను ధృవీకరిస్తాను అనే ఆప్షన్ ఎంచుకోవాలి. 
 
పాన్ కార్డుతో రిజిస్టర్ అయిన మొబైల్ నంబరుకు వచ్చిన ఓటీని ఎంటర్ చేయాలి. వాలిడేట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత రూ.వెయ్యి అపరాధం చెల్లించిన తర్వాత మీ పాన్ కార్డు, ఆధార్ అనుసంధానం పూర్తవుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమిళ సినీ మూలస్తంభం ఏవీఎం శరవణన్ ఇకలేరు

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments