Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముకేశ్ అంబానీ కేసులో కీలక మలుపు.. SUV ఓనర్ మృతి

Webdunia
శనివారం, 6 మార్చి 2021 (09:03 IST)
ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ముకేశ్‌ అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్థాలు కలిగిన వాహనం యజమాని హిరేన్‌ మన్‌సుఖ్‌ (45) మరణించినట్టు థానె పోలీసులు శుక్రవారం తెలిపారు. థానె శివార్లలోని ఓ కాల్వలో అతని మృతదేహాన్ని కనుగొన్నట్టు చెప్పారు. అయితే మన్‌సుఖ్‌ ఆత్మహత్య చేసుకున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. 
 
గురువారం రాత్రి నుంచి మన్‌సుఖ్‌ కనిపించడంలేదని అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు, కొన్ని రోజులుగా తనను స్థానిక పోలీసులు వేధిస్తున్నారని మన్‌సుఖ్‌ ఇటీవల ఫిర్యాదు చేసినట్టు ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌కు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు.
 
అయితే ముకేశ్‌ అంబానీ ఇంటి వద్ద నిలిపిన స్కార్పియో వాహనం మన్‌సుఖ్‌ది కాదని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ శుక్రవారం చెప్పారు. కారు రిపేరింగ్‌ కోసం ఒకతను మన్‌సుఖ్‌కు ఈ కారును ఇచ్చారని తెలిపారు. 
 
ఈ కేసును రాష్ట్ర యాంటీ-టెర్రరిజమ్‌ స్కాడ్‌ (ఏటీఎస్‌)కు బదిలీ చేస్తున్నట్టు వెల్లడించారు. ఘటనపై బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. మరోవైపు, ఈ కేసు మీద ఎన్‌ఐఏ కూడా విచారణ జరుపుతుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనిల్‌ పరబ్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments