ఆధార్‌తో పాన్‌ కార్డు అనుసంధాన గడువు పెంపు..జూన్ 30లోగా..?

Webdunia
గురువారం, 1 ఏప్రియల్ 2021 (09:31 IST)
ఆధార్‌తో పాన్ కార్డు అనుసంధాన గడువు మార్చి 31వ తేదీతో ముగిసిన తరుణంలో.. డిస్‌మ్యాచ్, వెబ్ సైట్ మొరాయించడం వంటి ఇతరత్రా కారణాల ద్వారా చాలామంది ఆధార్‌తో పాన్ కార్డ్ అనుసంధానం చేసుకోలేకపోయారు. అలాంటి వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఆధార్‌తో పాన్‌ కార్డు అనుసంధాన గడువును మరోసారి పెంచినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) ఒక ప్రకటనలో తెలిపింది.
 
కోవిడ్‌-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. మార్చి 31 వరకూ ఉన్న ఈ గడువును పెంచాలని పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను శాఖను కోరారు. దీంతోపాటు, చివరి నిమిషంలో ఎదురైన ఇబ్బందులనూ దృష్టిలో పెట్టుకొని, ప్రభుత్వంప్రత్యక్ష పన్నుల వివాదాలకు సంబంధించి 'వివాద్‌ సే విశ్వాస్‌' గడువు బుధవారంతో ముగిసిందని ప్రభుత్వం ప్రకటించింది.
 
కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ బిల్లు 2021 ద్వారా పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేసుకోని వారికి రూ.1000 జరిమానా విధించేలా కొత్త రూల్ తీసుకువచ్చింది. ఫైనాన్స్ బిల్లు కొత్తగా ఆదాయపు పన్ను చట్టంలో సెక్షన్ 234 హెచ్‌ను కూడా తీసుకువచ్చింది. దీని ద్వారా పెనాల్టీ విధిస్తారు. అందువల్ల పాన్ కార్డుతో ఆధార్ లింక్ చేసుకోని వారు ఉంటే జూన్ 30లోగా రెండింటినీ లింక్ చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం పాన్ ఆధార్ లింక్ గడువును గతంలో చాలా సార్లు పొడిగించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీకి చాలా అవార్డులు వస్తాయి - బీవీఎస్ రవి

Janhvi Swaroop: కౌశిక్ గోల్డ్, డైమండ్స్ ప్రచారకర్తగా జాన్వి స్వరూప్ ఘట్టమనేని

సంచలనంగా మారిన మన శంకరవర ప్రసాద్ గారు మీసాల పిల్ల సాంగ్

Mahesh Babu: మహేష్ బాబు .. బిజినెస్‌మ్యాన్ 4K ప్రింట్‌తో రీ-రిలీజ్

Kalivi Vanam: వనాలను రక్షించుకోవాలనే నేపథ్యంతో కలివి వనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

తర్వాతి కథనం
Show comments