Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు బాలికలు .. 8 మంది యువకులు.. అడవిలోకి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్

Webdunia
గురువారం, 1 ఏప్రియల్ 2021 (09:16 IST)
ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఒకటైన త్రిపురలో ఇద్దరు బాలికలు సామూహిక అత్యాచారానికి గురయ్యారు. ఈ దారుణానికి ఎనిమిది మంది యువకులు పాల్పడ్డారు. ఖౌవాయి జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఈ సామూహిక లైంగికదాడిలో తీవ్రంగా గాయపడిన ఓ బాలిక పరిస్థితి విషమంగా ఉంది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఖటియాబరి ప్రాంతానికి చెందిన ఇద్దరు బాలికలు తమ ఇద్దరు స్నేహితులతో కలిసి సోమవారం సాయంత్రం బైక్‌పై బయటకు వెళ్లారు. కొంతదూరం వెళ్లిన తర్వాత మరో ఆరుగురు యువకులు బైక్‌లపై వచ్చి వారిని కలిశారు. 
 
ఆ తర్వాత వారంతా కలిసి ఆ ఇద్దరు బాలికలను అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికలు అపస్మారక స్థితికి వెళ్లడంతో భయపడిన యువకులు వారిని అక్కడే వదిలేసి పరారయ్యారు.
 
బాలికలు కనిపించకపోవడంతో కంగారు పడిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారితో కలిసి గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో అడవిలో అపస్మారకస్థితిలో ఉన్న బాలికలు కనిపించారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఓ బాలిక పరిస్థితి విషమంగా మారడంతో ఆమెను మరో ఆసుపత్రికి తరలించారు. ఎనిమిది మంది కామాంధులపై  పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం