Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుణ గ్రహీతలకు తీపికబురు.. యధాతథంగా కీలక వడ్డీరేట్లు

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (14:38 IST)
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రుణ గ్రహీతలకు తీపికబురు అందించింది. కీలకమైన వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రుణ గ్రహీతలకు ఊరట కలుగనుంది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు. కీలకమైన పాలసీ రేట్లను స్థిరంగా కొనసాగిస్తున్నట్లు రిజర్వు బ్యాంక్ తెలిపింది. దీంతో రెపో రేటు 4 శాతం వద్దనే నిలకడగా కొనసాగుతోంది. రివర్స్ రెపో 3.35 శాతం వద్ద స్థిరంగా ఉంది.
 
రిజర్వు బ్యాంక్ 2020 మే 22న చివరిగా కీలకమైన పాలసీ రేట్లను సవరించింది. అప్పటి నుంచి రేట్లు స్థిరంగాన ఉంటూ వస్తున్నాయి. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలకమైన వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించడం వల్ల రుణ గ్రహీతలకు ఊరట కలుగనుంది. 
 
రుణ రేట్లు కూడా స్థిరంగానే కొనసాగే అవకాశముంది. పెరగకపోవచ్చు. అంతేకాకుండా బ్యాంకులు రుణ రేట్లను మరింత తగ్గించే ఛాన్స్ కూడా ఉంది. రుణ గ్రహీతలకు ఇది ఊరట కలిగే అంశమని చెప్పుకోవచ్చు. కేంద్ర బడ్జెట్ 2021-22 తర్వాత ఆర్‌బీఐ తన మానిటరీ పాలసీలో వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments