Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుణ గ్రహీతలకు తీపికబురు.. యధాతథంగా కీలక వడ్డీరేట్లు

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (14:38 IST)
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రుణ గ్రహీతలకు తీపికబురు అందించింది. కీలకమైన వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రుణ గ్రహీతలకు ఊరట కలుగనుంది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు. కీలకమైన పాలసీ రేట్లను స్థిరంగా కొనసాగిస్తున్నట్లు రిజర్వు బ్యాంక్ తెలిపింది. దీంతో రెపో రేటు 4 శాతం వద్దనే నిలకడగా కొనసాగుతోంది. రివర్స్ రెపో 3.35 శాతం వద్ద స్థిరంగా ఉంది.
 
రిజర్వు బ్యాంక్ 2020 మే 22న చివరిగా కీలకమైన పాలసీ రేట్లను సవరించింది. అప్పటి నుంచి రేట్లు స్థిరంగాన ఉంటూ వస్తున్నాయి. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలకమైన వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించడం వల్ల రుణ గ్రహీతలకు ఊరట కలుగనుంది. 
 
రుణ రేట్లు కూడా స్థిరంగానే కొనసాగే అవకాశముంది. పెరగకపోవచ్చు. అంతేకాకుండా బ్యాంకులు రుణ రేట్లను మరింత తగ్గించే ఛాన్స్ కూడా ఉంది. రుణ గ్రహీతలకు ఇది ఊరట కలిగే అంశమని చెప్పుకోవచ్చు. కేంద్ర బడ్జెట్ 2021-22 తర్వాత ఆర్‌బీఐ తన మానిటరీ పాలసీలో వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments