Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆప్కో చేనేత వస్త్ర ప్రదర్శనను ప్రారంభించిన జెసి, ఒకటి కొంటే రెండు ఉచితం

Webdunia
శనివారం, 17 అక్టోబరు 2020 (18:56 IST)
చేనేత వస్త్రాలను ప్రోత్సహించటం ద్వారా లక్షలాది మంది కార్మికులకు జీవనోపాధి చూపించవచ్చని కృష్ణా జిల్లా సంయిక్త పాలనాధికారి (అభివృద్ధి) ఎల్. శివ శంకర్ అన్నారు. దసరా పర్వదినాలను పురస్కరించుకుని విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం సమీపంలోని బాపు మ్యూజియం అవరణలో శనివారం ఆప్కో చేనేత వస్త్ర ప్రదర్శన, అమ్మకంను శివశంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలిచే చేనేత వస్త్రాల వినియోగం మరింత పెంపొందించవలసి ఉందన్నారు.
 
ఆప్కో జిఎం(పరిపాలన) రమేష్ మాట్లాడుతూ, ఈ నెల 26వ తేదీ వరకు ఈ ప్రదర్శన అందుబాటులో ఉంటుందని, ఎంపిక చేసిన వస్త్ర శ్రేణిపై 30 శాతం రాయితీ అందిస్తున్నామని తెలిపారు. మరోవైపు ఒకటి కొంటే ఒకటి ఉచితం, ఒకటి కొంటే రెండు ఉచితం ప్రాతిపదికన మరిన్ని వస్త్రాలు అందుబాటులో ఉన్నాయన్నారు.
 
ఈ ప్రదర్శనలో మంగళగిరి, మచిలీపట్నం, రాజమండ్రి, ఉప్పాడ, చీరాల, వెంకటగిరి, మాధవరం చీరలను అందుబాటులో ఉంచామని అప్కో మండల వాణిజ్య అధికారి ఎస్ వివి ప్రసాద రెడ్డి తెలిపారు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

Raj_Sam: రాజ్‌తో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సమంత.. వీడియో వైరల్

పెళ్లంటూ చేసుకుంటే విడాకులు తీసుకోకూడదు.. జీవితాంతం వుండాలి: త్రిష

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

Samantha: శుభం చిత్ర బృందంతో శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ సమంత (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments