Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైళ్లలో ఎకానమీ క్లాస్ బోగీలు.. తక్కువ చార్జీలతో ఏసీ ప్రయాణం

రైల్వే ఆధునకీకరణ చర్యల్లో భాగంగా, ప్రయాణికుల సౌకర్యం కోసం భారతీయ రైల్వే తొలిసారి రైలు ప్రయాణంలో ఎకానమీ క్లాసును ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఎకానమీ ఏసీ బోగీలను తయారు చేయనుంది. వీటిలో తక్కువ

Webdunia
సోమవారం, 3 జులై 2017 (14:52 IST)
రైల్వే ఆధునకీకరణ చర్యల్లో భాగంగా, ప్రయాణికుల సౌకర్యం కోసం భారతీయ రైల్వే తొలిసారి రైలు ప్రయాణంలో ఎకానమీ క్లాసును ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఎకానమీ ఏసీ బోగీలను తయారు చేయనుంది. వీటిలో తక్కువ చార్జీతో ఏసీ కోచ్‌లలో ప్రయాణించే వెసులుబాటు లభిస్తుంది. 
 
ఎక్కువదూరం ప్రయాణించే రైళ్లలో ఏసీ కోచ్‌ల సంఖ్యను క్రమంగా పెంచుకొంటూ వస్తున్న రైల్వేలు త్వరలో ఆటోమేటిక్ తలుపులతో కూడిన పూర్తి ఏసీ కోచ్ రైళ్లను ప్రవేశపెట్టనున్నాయి. ప్రస్తుతం మూడురకాల ఏసీ-3, ఏసీ-2, ఏసీ-1 కోచ్‌లున్నాయి. వీటికి అదనంగా ఇకపై ఎకానమీ ఏసీ కోచ్‌లను ఏర్పాటు చేస్తారు. 
 
ఈ నాలుగు రకాల్లో ప్రయాణికులు ఏరకాన్నైనా ఎంచుకోవచ్చు. ఇప్పుడు రాజధాని, శతాబ్ది, హమ్‌సఫర్, తేజస్ రైళ్లు మాత్రమే పూర్తి ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లు కలిగినవి. అయితే వీటిలో బోగీలు తక్కువ. అందుకని ఎంపిక చేసిన రూట్లలో ముందుగా పూర్తి ఏసీ కోచ్ రైళ్లను ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకొంటున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments