Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇక రుతు సెలవులు తీసుకోవచ్చు..

Webdunia
సోమవారం, 10 ఆగస్టు 2020 (15:06 IST)
దేశీయ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో తమ సంస్థలోని మహిళా ఉద్యోగులకు పెద్ద బహుమతి ఇచ్చింది. మహిళలకు రుతు సెలవులు ఇవ్వబోతోంది. కంపెనీలో పనిచేసే మహిళలతో పాటు, ట్రాన్స్‌జెండర్లకు కూడా ప్రయోజనం లభిస్తుంది. భారతదేశంతో పాటు, ఇతర దేశాలలో కూడా ఈ సంస్థ తన సేవలను అందిస్తుంది. జొమాటోలో ఐదువేల మందికి పైగా పనిచేస్తున్నారు.
 
భారత్‌లో రుతుస్రావం గురించి అవగాహన లేకపోవడం వల్ల భారతదేశంలో లక్షలాది మంది మహిళలు బాలికలు ఇప్పటికీ వివక్ష, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అటువంటి పరిస్థితిలో, జొమాటో నిర్ణయాన్ని, నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇక జొమాటో ఈ కొత్త రూల్ పీరియడ్ పాలసీని ఇప్పటికే అమల్లోకి తెచ్చింది. సంస్థలో పనిచేసే సంస్కృతిని ప్రోత్సహించడమే తమ లక్ష్యమని కంపెనీ తెలిపింది. 
 
పీరియడ్ లీవ్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఎలాంటి మొహమాటం ఉండకూడదని జోమాటో సీఈఓ దీపెందర్ గోయల్ తన మహిళా ఉద్యోగులందరికీ ఇ-మెయిల్ ద్వారా చెప్పారు. ఈ సెలవు తీసుకోవడానికి పూర్తిగా ఉచితమని తెలిపారు. పీరియడ్ లీవ్ కోసం, మీ సహోద్యోగులకు ఇమెయిల్, ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడం, ద్వారా తెలియజేసి సెలవు తీసుకోవాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sanoj Mishra: సినిమా ఛాన్సిస్తానని యువతిపై అత్యాచారం.. మోనాలిసా టైమ్ బాగుండి..?

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అమర్ దీప్ చౌదరి హీరోగా సుమతీ శతకం ప్రారంభం

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

తర్వాతి కథనం
Show comments