Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇక రుతు సెలవులు తీసుకోవచ్చు..

Webdunia
సోమవారం, 10 ఆగస్టు 2020 (15:06 IST)
దేశీయ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో తమ సంస్థలోని మహిళా ఉద్యోగులకు పెద్ద బహుమతి ఇచ్చింది. మహిళలకు రుతు సెలవులు ఇవ్వబోతోంది. కంపెనీలో పనిచేసే మహిళలతో పాటు, ట్రాన్స్‌జెండర్లకు కూడా ప్రయోజనం లభిస్తుంది. భారతదేశంతో పాటు, ఇతర దేశాలలో కూడా ఈ సంస్థ తన సేవలను అందిస్తుంది. జొమాటోలో ఐదువేల మందికి పైగా పనిచేస్తున్నారు.
 
భారత్‌లో రుతుస్రావం గురించి అవగాహన లేకపోవడం వల్ల భారతదేశంలో లక్షలాది మంది మహిళలు బాలికలు ఇప్పటికీ వివక్ష, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అటువంటి పరిస్థితిలో, జొమాటో నిర్ణయాన్ని, నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇక జొమాటో ఈ కొత్త రూల్ పీరియడ్ పాలసీని ఇప్పటికే అమల్లోకి తెచ్చింది. సంస్థలో పనిచేసే సంస్కృతిని ప్రోత్సహించడమే తమ లక్ష్యమని కంపెనీ తెలిపింది. 
 
పీరియడ్ లీవ్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఎలాంటి మొహమాటం ఉండకూడదని జోమాటో సీఈఓ దీపెందర్ గోయల్ తన మహిళా ఉద్యోగులందరికీ ఇ-మెయిల్ ద్వారా చెప్పారు. ఈ సెలవు తీసుకోవడానికి పూర్తిగా ఉచితమని తెలిపారు. పీరియడ్ లీవ్ కోసం, మీ సహోద్యోగులకు ఇమెయిల్, ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడం, ద్వారా తెలియజేసి సెలవు తీసుకోవాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments