Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇక రుతు సెలవులు తీసుకోవచ్చు..

Webdunia
సోమవారం, 10 ఆగస్టు 2020 (15:06 IST)
దేశీయ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో తమ సంస్థలోని మహిళా ఉద్యోగులకు పెద్ద బహుమతి ఇచ్చింది. మహిళలకు రుతు సెలవులు ఇవ్వబోతోంది. కంపెనీలో పనిచేసే మహిళలతో పాటు, ట్రాన్స్‌జెండర్లకు కూడా ప్రయోజనం లభిస్తుంది. భారతదేశంతో పాటు, ఇతర దేశాలలో కూడా ఈ సంస్థ తన సేవలను అందిస్తుంది. జొమాటోలో ఐదువేల మందికి పైగా పనిచేస్తున్నారు.
 
భారత్‌లో రుతుస్రావం గురించి అవగాహన లేకపోవడం వల్ల భారతదేశంలో లక్షలాది మంది మహిళలు బాలికలు ఇప్పటికీ వివక్ష, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అటువంటి పరిస్థితిలో, జొమాటో నిర్ణయాన్ని, నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇక జొమాటో ఈ కొత్త రూల్ పీరియడ్ పాలసీని ఇప్పటికే అమల్లోకి తెచ్చింది. సంస్థలో పనిచేసే సంస్కృతిని ప్రోత్సహించడమే తమ లక్ష్యమని కంపెనీ తెలిపింది. 
 
పీరియడ్ లీవ్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు ఎలాంటి మొహమాటం ఉండకూడదని జోమాటో సీఈఓ దీపెందర్ గోయల్ తన మహిళా ఉద్యోగులందరికీ ఇ-మెయిల్ ద్వారా చెప్పారు. ఈ సెలవు తీసుకోవడానికి పూర్తిగా ఉచితమని తెలిపారు. పీరియడ్ లీవ్ కోసం, మీ సహోద్యోగులకు ఇమెయిల్, ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడం, ద్వారా తెలియజేసి సెలవు తీసుకోవాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

షూటింగ్ లో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ కు స్వల్పగాయాలు !

అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ సరైన సినిమా లేదు: నిర్మాత నాగవంశీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments