Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలిని శీతల పానీయంలో విష పదార్థం కలిపి ఇచ్చి..?

Webdunia
సోమవారం, 10 ఆగస్టు 2020 (14:57 IST)
ప్రియురాలిని ఓ ప్రియుడు హతమార్చాడు. అదీ శీతల పానీయంలో విష పదార్థం కలిపి ఇచ్చి చంపేశాడు. ఈ దారుణ ఘటన హర్యానాలోని కురుక్షేత్రలో శనివారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. కురుక్షేత్రలోని భోలి గ్రామానికి చెందిన పింకీకి రవి అనే వ్యక్తితో పదేళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. అయితే రవి డ్రగ్స్‌కు బానిస అయ్యాడు. దీంతో మూడేళ్ల క్రితం భర్త నుంచి వేరుపడి మకాంను ఆకాశ్ నగర్‌కు మార్చింది. ఆకాశ్ నగర్‌లో పింకీ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది. 
 
పింకీకి గంగా సింగ్ అనే వ్యక్తితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. గంగా సింగ్ మంచి మద్యం ప్రియుడు. గత కొన్ని రోజుల నుంచి పింకీని గంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. తనకు మద్యం తాగేందుకు డబ్బులివ్వాలని ఆమెను హింసిస్తున్నాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో పింకీ కూతురు తన సోదరుడికి విషయం చెప్పింది.
 
మొత్తానికి పింకీ ఇంటికి గంగా సింగ్ తన భార్యతో కలిసి ఆగస్టు 8న వచ్చాడు. ఆమెకు శీతల పానీయాల్లో విష పదార్థం కలిపి ఇచ్చారు. ఆమె ఆ పానీయాన్ని సేవించిన కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురైంది. వాంతులు చేసుకోవడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పింకీ కన్నుమూసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 షూటింగ్ పూర్తి, మూడేళ్ళ మేకింగ్ వీడియో

మాడ్యులేషన్‌లో ఏ డైలాగ్ అయినా చెప్పగలిగే గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments